ETV Bharat / bharat

ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఫోన్​.. క్వాడ్​ సమావేశంపై చర్చ!

author img

By

Published : Sep 15, 2021, 8:14 PM IST

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరీసన్​​తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై (India-Australia Partnership) చర్చించినట్లు తెలిపారు.

PM Modi speaks to Australian pm
ప్రధాని నరేంద్ర మోదీ, స్కాట్​ మోరిస్​

భారత్​- ఆస్ట్రేలియా (India-Australia Partnership) సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధాని నరేంద్రమోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​తో చర్చించారు. దీనితోపాటు రానున్న క్వాడ్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు. ఇరు దేశాల అభివృద్ధి గురించి ప్రధానంగా చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు.

  • Was happy to speak with my friend @ScottMorrisonMP. We reviewed the rapid progress in the India-Australia Comprehensive Strategic Partnership, including through the recent 2+2 Dialogue. We also exchanged perspectives on regional developments and the forthcoming Quad meeting.

    — Narendra Modi (@narendramodi) September 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" రాబోతున్న క్వాడ్​ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​​తో చర్చించాను. ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా మాట్లాడాము."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​లు ఆస్ట్రేలియా మంత్రులైన మారిస్​ పేస్​, పీటర్​ దట్టన్​తో కలిసి టూ ప్లస్​ టూ చర్చలు జరిపారు.

అఫ్గాన్​లో తాజా పరిణామాలు, కొవిడ్ లాంటి అంశాలపై వాషింగ్టన్​ వేదికగా జరగనున్న క్వాడ్​ సమావేశంలో చర్చించనున్నారు. దీనితో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకారాన్ని పెంచే మార్గాలపై కూడా మాట్లాడనున్నారు.

ఇదీ చూడండి: ఐరాస వేదికగా పాక్​కు భారత్​ చురకలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.