ETV Bharat / bharat

'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​' పథకానికి మోదీ శ్రీకారం

author img

By

Published : May 30, 2022, 11:17 AM IST

Updated : May 30, 2022, 11:32 AM IST

PM CARES CHILDREN
పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రెన్

PM CARES for Children Scheme: కొవిడ్​ కారణంగా అనాథలైన పిల్లలకు సాయం అందించే పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, దేశంలోని ప్రతి ఒక్కరు వారితోనే ఉన్నారనే భరోసాను కల్పిస్తుందన్నారు.

PM CARES for Children Scheme: కొవిడ్​ కారణంగా తల్లిందడ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్​ పథకం కింద సాయం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది అనాథలైన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కొవిడ్​ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తనకు తెలుసునని.. వారి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

" కొందరికి ఉన్నత విద్య కోసం విద్యా రుణాలు అవసరమవుతాయి. దానికి సైతం పీఎం కేర్స్​ సాయపడుతుంది. అలాంటి వారికి రోజువారీ ఖర్చుల కోసం ఇతర పథకాల ద్వారా నెలకు రూ.4వేలు అందిస్తున్నాం. ఒక ప్రధాని కాకుండా కుటుంబ సభ్యుడిగా పిల్లలతో మాట్లాడుతున్నా. ఈరోజు పిల్లల మధ్య ఉన్నందుకు చాలా రిలీఫ్​గా ఉన్నా. దేశంలోని ప్రతిఒక్కరు వారితో ఉన్నారనే భరోసాను పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ కల్పిస్తోంది. అనాథలైన చిన్నారులు పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కువ డబ్బు అవసరమవుతుంది. 18-23 ఏళ్ల వారికి ప్రతినెల స్టైఫండ్​ అందుతుంది. వారు 23 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత రూ.10 లక్షలు వస్తాయి. పీఎం కేర్స్​ ద్వారా ఆయుష్మాన్​ హెల్త్​ కార్డు అందిస్తాం. దాని ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లినో, తండ్రినో కోల్పోయిన పిల్లలకు ఉపకారవేతనాలు, పీఎం కేర్స్​ పాస్​ పుస్తకాలు, ఆయుష్మాన్​ భారత్​ వైద్య బీమా కార్డును అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా.. పిల్లలకు 18 ఏళ్లు నిండేసరికి వారి పేరిట రూ.10 లక్షల సొమ్ము ఉండేలా డిపాజిట్​ చేస్తారు. 18 నుంచి 23 ఏళ్ల వయసు వరకు ఆ డిపాజిట్​పై వడ్డీని వారికి ఆర్థిక సాయంగా అందిస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత పూర్తిగా రూ.10 లక్షలు లబ్ధిదారులకు ఇచ్చేస్తారు. అర్హులైన పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ పేరుతో ఒక పోర్టల్​ ప్రారంభించారు. పేర్ల నమోదు దగ్గర నుంచి దరఖాస్తుల ఆమోద ప్రక్రియ, సాయం అందించటం వరకు అన్నీ ఈ పోర్టల్​ ద్వారా మాత్రమే సాగుతాయి.

ఇదీ చూడండి: 'కరోనా సంక్షోభంలోనూ రూ.కోట్ల సంపద.. యూనికార్న్​ స్టార్టప్​ల సెంచరీ'

Last Updated :May 30, 2022, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.