ETV Bharat / bharat

'150 కోట్ల టీకాలు పంపిణీ.. ఆత్మనిర్భర భారత్​కు నిదర్శనమిదే'

author img

By

Published : Jan 7, 2022, 2:34 PM IST

pm modi
ప్రధాని మోదీ

PM Modi On Vaccination: శుక్రవారం దేశవ్యాప్తంగా 150కోట్ల వ్యాక్సిన్​ డోసుల పంపిణీ పూర్తయిందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. పేదలకు వైద్యపరమైన ప్రయోజనాలను అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కోల్​కతాలోని చిత్తరంజన్ నేషనల్ కేన్సర్​ ఇన్స్​స్టిట్యూట్​ రెండో క్యాపస్​ను వర్చువల్​ విధానంలో ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు మోదీ.

PM Modi On Vaccination: వ్యాక్సినేషన్​లో భారత్ కీలక ఘట్టానికి చేరుకుందని ప్రధాని మోదీ తెలిపారు. శుక్రవారం దేశవ్యాప్తంగా 150కోట్ల వ్యాక్సిన్​ డోసులను పంపిణీ పూర్తయిందన్నారు. పేదలకు వైద్యపరమైన ప్రయోజనాలను అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

pm modi
కేన్సర్ ఆస్పత్రిలోని రెండో క్యాంపస్​ను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

కోల్​కతాలోని చిత్తరంజన్ నేషనల్ కేన్సర్​ ఇన్స్​స్టిట్యూట్​ రెండో క్యాపస్​ను వర్చువల్​ విధానంలో ప్రారంభించారు మోదీ.

"దేశంలోని వయోజనుల జనాభాలో 90శాతానికిపైగా కొవిడ్ తొలి డోసు పూర్తయింది. కేవలం 5రోజుల్లోనే కోటిన్నరకు పైగా 15-17ఏళ్ల పిల్లలకు కొవిడ్ మొదటి డోసు పూర్తయింది. ఈ విజయం భారత్ ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విజయాన్ని అందుకోవడం ధనిక, అభివృద్ధి చెందిన దేశాలకూ సాధ్యం కాదు. ఆయుష్మాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 2.60కోట్ల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. అందులో 17లక్షల మంది కేన్సర్ బాధితులు కూడా ఉన్నారు."

-- ప్రధాని నరేంద్రమోదీ

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో బంగాల్​ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు.

దాదాపు రూ. 530కోట్ల నిధులతో చిత్తరంజన్ నేషనల్ కేన్సర్​ ఇన్స్​స్టిట్యూట్​లో రెండో క్యాంపస్​ను నిర్మించారు. ఈ ఆస్పత్రిలో 460 పడకల సామర్థ్యం ఉంది.

ఈ ఆస్పత్రిలో న్యూక్లియర్ మెడిసిన్​(పీఈటీ), 3.0 టెస్లా ఎంఆర్​ఐ, 128 స్లైస్ సీటీ స్కానర్, ఎండోస్కోపీ స్యూట్​.. లాంటి అధునాతన సాంకేతిక యంత్రాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: మోదీ పంజాబ్​ పర్యటనలో భద్రతా లోపాలపై సుప్రీం కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.