ETV Bharat / bharat

ఎన్నికల వేళ సిక్కు ప్రముఖులకు ప్రధాని మోదీ ఆతిథ్యం..

author img

By

Published : Feb 18, 2022, 2:26 PM IST

pm modi meets sikhs
ఎన్నికల వేళ సిక్కు ప్రముఖులతో మోదీ మీటింగ్

PM Modi Meets Sikhs: మరో రెండు రోజుల్లో పంజాబ్​లో పోలింగ్​ జరగనుండగా.. సిక్కు మతానికి చెందిన ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు. ఈ మేరకు దిల్లీలోని లోక్​కల్యాణ్​ మార్గ్​లోని మోదీ నివాసంలో వీరంతా మోదీతో సమావేశమయ్యారు.

PM Modi Meets Sikhs: ఫిబ్రవరి 20న పంజాబ్​లో పోలింగ్​ జరగనున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశం దిల్లీలోని మోదీ నివాసంలో జరిగింది.

pm modi meets sikhs
ప్రధాని మోదీకి పవిత్రమైన ఖడ్గాన్ని అందజేస్తున్న సిక్కు ప్రముఖులు

ఈ సమావేశంలో దిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్​జీ సించేవాల్, మహంత్ కరమ్​జీత్ సింగ్, కర్ణాల్​కు చెందిన బాబా జోగాసింగ్, అమృత్​సర్​కు చెందిన డేరాబాబా తారాసింగ్​.. తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ప్రధాని మోదీకి సిక్కులు పవిత్రమైన కిర్పన్​(ఖడ్గం) అందజేశారు. పంజాబ్ ఎన్నికల్లో భాజపా, కెప్టెన్ అమరిందర్​​సింగ్​కు చెందిన పంజాబ్ లోక్​ కాంగ్రెస్​ కలిసి పోటీ చేస్తున్నాయి. ఫిబ్రవరి 20న పంజాబ్ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంది.

ఇవీ చూడండి:

పంజాబ్ చతుర్ముఖ పోరులో గెలిచేదెవరు? కింగ్​ మేకర్​గా ఆ పార్టీ?

'రైతులకు నమ్మకద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్​ది'
punjab assembly election: అంతర్గత కలహాలే.. అసలు సవాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.