మహాత్మా గాంధీకి ప్రముఖుల నివాళులు

author img

By

Published : Oct 2, 2021, 8:22 AM IST

Updated : Oct 2, 2021, 10:23 AM IST

gandhi news

జాతిపిత మహాత్మా గాంధీకి (Gandhi Jayanti) రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నివాళులు అర్పించారు. రాజ్​ఘాట్​ను సందర్శించి పుష్పాంజలి అర్పించారు.

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆయనకు నివాళులు అర్పించారు. రాజ్​ఘాట్​ను సందర్శించిన మోదీ.. గాంధీ సమాధికి పుష్పాంజలి ఘటింటారు.

modi gandhi jayanthi
రాజ్​ఘాట్ వద్ద మోదీ..
modi gandhi jayanthi
గాంధీ సమాధికి వందనం చేస్తున్న ప్రధాని

అంతకుముందు గాంధీని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు మోదీ (PM Modi tweet today). బాపూజీ జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తాయని అన్నారు. గాంధీ ఆచరించిన సూత్రాలు సమకాలీన ప్రపంచానికి చాలా అవసరమని చెప్పారు. ఇవి లక్షలాది మందికి బలాన్నిస్తాయన్నారు.

అదేసమయంలో, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి శ్రద్ధాంజలి ఘటించారు మోదీ. ఆయన జీవితం దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తుందని అన్నారు.

మరోవైపు, రాజ్​ఘాట్​ను సందర్శించిన రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్.. గాంధీజీకి నివాళులు అర్పించారు. ఆయన సమాధికి పూలమాల అలంకరించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా సైతం రాజ్​ఘాట్​ను సందర్శించి గాంధీజీకి నివాళులు అర్పించారు. అనంతరం నేతలు విజయ్​ ఘాట్​కు వెళ్లి లాల్ బహదూర్ శాస్త్రికి శ్రద్ధాంజలి ఘటించారు.

gandhi jayanti
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
gandhi jayanti
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
gandhi jayanti
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పక్కనే మనీశ్ సిసోడియా
gandhi jayanti
లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా
GANDHIJI
రాజ్​ఘాట్ వద్ద రాహుల్ గాంధీ
GANDHIJI
విజయ్ ఘాట్ వద్ద రాహుల్ గాంధీ

గుటెరస్ ట్వీట్...

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం మహాత్ముడిని స్మరించుకున్నారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవమైన ఈ రోజు.. గాంధీ ప్రవచించిన శాంతి సందేశంతో మెరుగైన భవిష్యత్ నిర్మాణాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. శాంతి, విశ్వాసం, సహనంతో కూడిన కొత్త శకానికి నాంది పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

ఇదీ చదవండి: ఆఖరి జన్మదినాన గాంధీ ఏం సందేశమిచ్చారు?

Last Updated :Oct 2, 2021, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.