ETV Bharat / bharat

టెర్రరిస్ట్​గా మారిన గవర్నమెంట్ టీచర్​.. తొలిసారి 'పెర్ఫ్యూమ్​ బాంబ్​' స్వాధీనం చేసుకున్న పోలీసులు

author img

By

Published : Feb 2, 2023, 3:03 PM IST

వైష్టో దేవి యాత్రికుల బస్సుపై బాంబు పేలుడుకు పాల్పడిన నిందితుడిని జమ్ముకశ్మీర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడి దగ్గర ఒక పెర్ఫ్యూమ్ బాంబ్​ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇలాంటి బాంబును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని జమ్ముకశ్మీర్​ పోలీస్​ డైరెక్టర్​ జనరల్ దిల్బాగ్ సింగ్​ తెలిపారు.

jammu kashmir police
jammu kashmir police

వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబు పేలుడుకు పాల్పడిన నిందితుడిని జమ్ముకశ్మీర్​ పోలీసులు.. గురువారం అరెస్ట్​ చేశారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడైన రియాసి జిల్లాకు చెందిన ఆరిఫ్​.. లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారి బాంబు దాడికి పాల్పడ్డాడని జమ్ముకశ్మీర్​ పోలీస్​ డైరెక్టర్​ జనరల్ దిల్బాగ్​​ సింగ్​ తెలిపారు.

నిందితుడి దగ్గర నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్‌లో అమర్చిన ఐఈడీని స్వాధీనం చేసుకున్నట్లు దిల్బాగ్​​ సింగ్ వెల్లడించారు. కేంద్రపాలిత ప్రాంతంలో ఇలాంటి బాంబును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. ఆరిఫ్.. పాకిస్థాన్​ ఉగ్రవాదులు ఆదేశానుసారం పనిచేస్తున్నాడని, ఐఈడీలు సరిహద్దు అవతల నుంచి అతడి దగ్గరకు వస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

perfume-ied-was-recovered-from-the-terrorist-arif-by-jammu-kashmir-police
పోలీసులు స్వాధీనం చేసుకున్న పెర్ఫ్యూమ్​ బాంబ్

"జమ్ముకశ్మీర్​లో పెర్ఫ్యూమ్ ఐఈడీని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఎవరైనా నొక్కడానికి లేదా తెరవడానికి ప్రయత్నిస్తే ఐఈడీ పేలుతుంది. మా ప్రత్యేక బృందం ఆ ఐఈడీని పరిశీలిస్తుంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్​లో ఉన్న ప్రజల మధ్య మతపరమైన విభజన సృష్టించాలని పాకిస్థాన్​ కోరుకుంటోంది."

-- దిల్బాగ్​ సింగ్, జమ్ముకశ్మీర్​ పోలీస్​ డైరెక్టర్​ జనరల్

గతేడాది మే నెలలో.. వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు ఫిబ్రవరి నెలలో జమ్ము శాస్త్రినగర్​తోపాటు నార్వాల్​​లో జరిగిన జంట పేలుళ్లలో తొమ్మిది మంది గాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.