ETV Bharat / bharat

'లఖింపుర్'​పై దద్దరిల్లిన పార్లమెంట్​- ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా

author img

By

Published : Dec 16, 2021, 11:18 AM IST

Updated : Dec 16, 2021, 2:18 PM IST

PARLIAMENT winter session
PARLIAMENT winter session

14:16 December 16

పార్లమెంట్​లో లఖింపుర్​ రగడ- ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా

లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనలపై పార్లమెంట్​ ఉభయ సభలు హోరెత్తాయి. నిరసనలతో మధ్యాహ్నానికి వాయిదా పడిన లోక్​సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా.. ఆందోళనలు కొనసాగించారు విపక్ష సభ్యులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్ర రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్​ చేశారు. విపక్షాల నినాదాలతో సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

రాజ్యసభలో ఇదే తీరు కనిపించింది. లఖింపుర్​ ఖేరి హింసపై చర్చ చేపట్టాలని, కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలని నిరసనలు చేపట్టారు విపక్ష నేతలు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

12:06 December 16

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర.. ఆ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, రాజీనామా కోసం విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో.. ఆయన అక్కడికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

11:11 December 16

పార్లమెంట్ లైవ్

  • Lok Sabha adjourned till 11am of 17th December following uproar by Opposition MPs over the Lakhimpur Kheri incident and their demand for resignation of MoS Home Ajay Misra Teni pic.twitter.com/jj9pZmGYLz

    — ANI (@ANI) December 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పార్లమెంట్​లో విపక్షాల ఆందోళనలు గురువారం సైతం కొనసాగాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం రెండు గంటలకు సభలు తిరిగి సమావేశం కానున్నాయి.

లఖింపుర్ ఖేరి ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న సిట్ నివేదికపై లోక్​సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో సభ వాయిదా పడింది.

రాజ్యసభలోనూ లఖింపుర్ అంశంపైనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఆయన కుమారుడు ఆశిశ్​ మిశ్రా ఈ ఘటనలో నిందితునిగా ఉన్నారు.

Last Updated :Dec 16, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.