లాటరీ టికెట్ కొన్న గంటలకే.. రూ.12 కోట్ల జాక్​పాట్

author img

By

Published : Jan 17, 2022, 7:10 AM IST

Updated : Jan 19, 2022, 8:06 AM IST

kerala lottery

Lottery in Kerala: యాభై ఏళ్లుగా పెయింటింగ్ పని చేస్తూ జీవిస్తున్న ఓ కార్మికుడు రూ. 12 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. విజేతలను ప్రకటించడానికి కొన్ని గంటల ముందే లాటరీ టికెట్ కొనడం విశేషం.

Painting worker wins Rs 12 crore: కేరళకు చెందిన ఓ పెయింటింగ్ కార్మికుడిని అదృష్టం వరించింది. కొట్టాయంలోని అయ్​మాననం ప్రాంతానికి చెందిన సదానందన్.. క్రిస్మస్-న్యూఇయర్ సందర్భంగా నిర్వహించిన బంపర్ లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.

kerala lottery 12 crore
కుటుంబ సభ్యులతో సదానందన్
kerala lottery 12 crore
భార్యతో కలిసి పేపర్ చూస్తున్న సదానందన్

లక్కీ డ్రా విజేతలను ప్రకటించడానికి కొద్ది గంటల ముందే లాటరీని కొన్నాడు సదానందన్. గత యాభై ఏళ్లుగా తాను పెయింటింగ్ వృత్తిలోనే ఉన్నట్లు తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బును తన పిల్లల భవిష్యత్ కోసం ఉపయోగించుకుంటానని చెప్పాడు.

kerala lottery 12 crore
.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో పిజ్జా ఆర్డర్ చేస్తే.. రూ.11 లక్షలు హాంఫట్!

Last Updated :Jan 19, 2022, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.