covid vaccine: దేశంలో 75 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

author img

By

Published : Sep 13, 2021, 6:17 PM IST

Updated : Sep 13, 2021, 9:19 PM IST

vaccination
దేశంలో 75 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ ()

భారత్​లో టీకా పంపిణీ సంఖ్య 75 కోట్లు దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. కేవలం 13 రోజుల్లోనే పంపిణీ (covid vaccine) సంఖ్య 65 కోట్ల నుంచి 75 కోట్లకు చేరింది.

భారత్​లో టీకా పంపిణీ విస్తృతంగా సాగుతోంది. ఈ క్రమంలో సోమవారం మరో మైలురాయిని అందుకుంది భారత్​. ఇప్పటివరకు 75 కోట్లు డోసుల (covid vaccine) పంపిణీ పుర్తయింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ వెల్లడించారు.

'ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన ఏడాదిలో.. 75 కోట్ల టీకాల పంపిణీ జరగడం విశేషం.'

-మన్​సుఖ్​ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

75 కోట్లు డోసులు పంపిణీ పూర్తవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్​ను అభినందించింది. కేవలం 13 రోజుల్లోనే పంపిణీ సంఖ్య 65 కోట్ల నుంచి 75 కోట్లకు చేరిందని కొనియాడింది.

సిక్కిం, హిమాచల్​ప్రదేశ్, గోవా, దాద్రా-నగర్​ హవేలీ, లద్దాఖ్​, లక్షద్వీప్​లలో పెద్దలు అందరూ టీకా తీసుకున్నారు. వీరిలో కొందరు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకోగా.. మరికొందరు ఒక డోసు తీసుకున్నారు.

దేశంలో వ్యాక్సిన్​ పంపిణీ సంఖ్య 10 కోట్లు (covid vaccine) చేరడానికి 85 రోజులు పట్టింది. ఆ తర్వాత క్రమంగా టీకా పంపిణీ పుంజుకుంది. అక్కడి నుంచి వ్యాక్సినేషన్​ సంఖ్య.. 45 రోజుల్లో 20 కోట్లకు, 20 రోజుల్లో 50 కోట్లకు, 19 రోజుల్లో 60 కోట్లకు చేరింది.

విడతల వారీగా చేపట్టిన వ్యాక్సినేషన్​.. జనవరి 16న ​ప్రారంభమైంది.

రాష్ట్రాల్లో కరోనా కేసులు..

  • కేరళలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 15,058 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 28,439 మంది కోలుకోగా.. 99 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 16.39 శాతంగా ఉంది.
  • మహారాష్ట్రలో కొత్తగా 2740 మందికి మహమ్మారి సోకింది. ఫిబ్రవరి 9 తర్వాత రాష్ట్రంలో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 3233 మంది వైరస్​ను జయించగా.. 27 మంది మృతిచెందారు.
  • కర్ణాటకలో కొత్తగా 673 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. మహమ్మారి నుంచి 1074 మంది కోలుకోగా.. వైరస్​ ధాటికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొత్త 17 మందికి కరోనా సోకగా.. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.

ఇదీ చూడండి : 'కొవాగ్జిన్​కు ఈ వారంలోనే డబ్ల్యూహెచ్​ఓ గుర్తింపు!'

Last Updated :Sep 13, 2021, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.