ETV Bharat / bharat

ఆమ్లెట్​ వేయలేదని భార్యను హత్య చేసిన భర్త.. ఆపై!

author img

By

Published : Feb 19, 2022, 7:55 PM IST

Updated : Feb 19, 2022, 8:39 PM IST

omelette murder wife refused to make omelette husband killed
ఆమ్లెట్​ వేయలేదని భార్యను హతమార్చిన భర్త

omelette murder: ఆమ్లెట్​ వేయలేదని ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. అంతేగాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని సీలింగ్​​ ఫ్యాన్​కు వేలాడ దీశాడు. ఈ ఘటన బిహార్​లోని సీతామఢీలో జరిగింది.

omelette murder: బిహార్​లోని సీతామఢీలో దారుణం జరిగింది. ఆమ్లెట్​ వేయలేదని భార్యను కడతేర్చాడు ఓ భర్త. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పడక గదిలోని సీలింగ్​ ఫ్యాన్​కు ఆమె మృతదేహాన్ని వేలాడ తీశాడు.

ఇదీ జరిగింది..

బిహార్​, సీతామఢీ జిల్లా.. సహియారా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బెలాహిజయ్ రామ్ గ్రామానికి చెందిన అజిత్​ సింగ్ మద్యానికి బానిస అయ్యాడు. రోజు తాగి వచ్చి భార్యను హింసించే వాడు. గురువారం రోజు కూడా యథావిధిగా తాగి ఇంటికి వచ్చాడు అజిత్​ సింగ్​. వచ్చేటప్పుడు మంచింగ్​ కోసం కొన్ని కోడి గుడ్లు తెచ్చాడు. ఆమ్లెట్​ వేయమని భార్య నీతూ దేవికి చెప్పాడు. అయితే గురువారం కావడం వల్ల వద్దని వారించింది. దీనికి కోపం తెచ్చుకున్న అజిత్​.. భార్యపై చేయి చేసుకున్నాడు.

omelette murder wife refused to make omelette husband killed
ఆమ్లెట్​ వేయలేదని భార్యను హతమార్చిన భర్త

ఈ క్రమంలోనే తన మాట వినడం లేదని ఆమెను గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా.. సీలింగ్​ ఫ్యాన్​కు భార్య మృతదేహాన్ని వేలాడదీసి ఇంటి నుంచి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: భర్త జననాంగాలు కోసి దారుణ హత్య.. కారణం ఇదే!

Last Updated :Feb 19, 2022, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.