ETV Bharat / bharat

అజిత్​ డోభాల్​కు భద్రత పెంపు

author img

By

Published : Feb 13, 2021, 12:36 PM IST

NSA Ajit Doval tightened
అజిత్​ డోభాల్​కు భద్రత పెంపు

జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ భద్రతను పెంచారు అధికారులు. జైషే మహ్మద్​కు చెందిన ఓ ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న వీడియోలో.. డోభాల్​ ఆఫీసు వద్ద ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్టు ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. డోభాల్​కు భద్రతను కట్టుదిట్టం చేశారు.

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ భద్రతను అధికారులు పెంచారు. జైషే మహ్మద్​కు చెందిన హిదాయత్​ ఉల్లా మాలిక్ అనే ఉగ్రవాది నుంచి వీడియో స్వాధీనం చేసుకున్న అనంతరం డోభాల్​కు భద్రతను కట్టుదిట్టం చేశారు. జైషే ఉగ్రవాదులు.. డోభాల్​ కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించినట్టు ఆ వీడియోలో ఉంది.

అయితే.. రెక్కీ గతేడాది నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలను మాలిక్​ రికార్డు చేసి.. పాకిస్థాన్​లోని కొందరికి పంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

2016 ఉరీ మెరుపు దాడులు, 2019 బాలాకోట్​ వైమానిక దాడుల ప్రణాళికలో డోభాల్​ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే.. డోభాల్​ను ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:- భాజపా కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.