ETV Bharat / bharat

దిల్లీ, ముంబయిలో హోలీ వేడుకలు నిషేధం

author img

By

Published : Mar 24, 2021, 5:03 AM IST

No public celebrations in Delhi, mumbai during Holi
దిల్లీ, ముంబయిలో హోలీ వేడుకలు నిషేధం

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోలీ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ముంబయిలోనూ కొవిడ్​ ఉద్ధృతి నేపథ్యంలో.. నగరంలో మార్చి 28, 29 తేదీల్లో వేడుకలు బ్యాన్​ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

దిల్లీ, మహారాష్ట్రల్లో కరోనా కేసులు కల్లోలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. దేశ రాజధాని సహా ముంబయి నగరాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

దిల్లీలో ఈ ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1101 కొవిడ్​ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనూ 28వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దిల్లీ ప్రభుత్వం హోలీ, నవరాత్రి వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.

వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

కఠిన చర్యలు..

ముంబయిలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హోలీ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు బృహన్​ ముంబయి కార్పొరేషన్​ ప్రకటించింది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'మహా'లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.