ETV Bharat / bharat

'అలాంటి దేశాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు'

author img

By

Published : Jan 28, 2022, 2:38 PM IST

modi
ప్రధాని మోదీ

PM at NCC Rally: దేశాభివృద్ధే ప్రాధాన్యంగా పనిచేసే యువత ఉంటే.. ఆ దేశాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదన్నారు ప్రధాని నరేంద్రమోదీ. అంకుర సంస్థల నుంచి ఆటల వరకు ప్రతి రంగంలోనూ యువత ముందుందని ప్రశంసించారు మోదీ.

PM at NCC Rally: దేశంలోని యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్రమోదీ. దేశాభివృద్ధే తొలి ప్రాధాన్యంగా పనిచేసే యువత ఉంటే.. ఆ దేశాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. అంకురాల నుంచి ఆటల వరకు ప్రతి రంగంలో భారతీయ యువత సత్తాచాటుతోందని మోదీ ప్రశంసలు కురిపించారు.

NCC rally
పీఎం ర్యాలీలో ఎన్​సీసీ క్యాడెట్ల ప్రదర్శన
NCC rally
పీఎం ర్యాలీలో కశ్మీర్ క్యాడెట్లు
NCC rally
పీఎం ర్యాలీలో పాల్గొన్న ఎన్​సీసీ క్యాడెట్లు

దిల్లీలోని కేసీ కరియప్ప మైదానంలో నిర్వహించిన నేషనల్ క్యాడెట్​ కార్ప్స్​(ఎన్​సీసీ) ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

modi
సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

"ఎన్​సీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేశాం. గత రెండేళ్లలో లక్షమందికి పైగా ఎన్​సీసీ క్యాడెట్​​లను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించాం. సైన్యంలో మహిళలకు ఎంతో బాధ్యత పెరిగింది. మాదకద్రవ్యాలకు ఎన్​సీసీ సభ్యులు దూరంగా ఉండాలి."

-- ప్రధాని నరేంద్రమోదీ

భారత్ ఆత్మనిర్భరత సాధించడంలో యువత పెద్దపాత్ర పోషిస్తోందన్నారు ప్రధాని మోదీ. గ్రామీణ ఉత్పత్తులు ఉపాధిని, ఉత్పత్తిని పెంచుతాయని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: భారత్​ బయోటెక్​ 'చుక్కల టీకా' ట్రయల్స్​కు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.