PM at NCC Rally: దేశంలోని యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్రమోదీ. దేశాభివృద్ధే తొలి ప్రాధాన్యంగా పనిచేసే యువత ఉంటే.. ఆ దేశాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. అంకురాల నుంచి ఆటల వరకు ప్రతి రంగంలో భారతీయ యువత సత్తాచాటుతోందని మోదీ ప్రశంసలు కురిపించారు.
దిల్లీలోని కేసీ కరియప్ప మైదానంలో నిర్వహించిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్సీసీ) ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
"ఎన్సీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేశాం. గత రెండేళ్లలో లక్షమందికి పైగా ఎన్సీసీ క్యాడెట్లను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించాం. సైన్యంలో మహిళలకు ఎంతో బాధ్యత పెరిగింది. మాదకద్రవ్యాలకు ఎన్సీసీ సభ్యులు దూరంగా ఉండాలి."
-- ప్రధాని నరేంద్రమోదీ
భారత్ ఆత్మనిర్భరత సాధించడంలో యువత పెద్దపాత్ర పోషిస్తోందన్నారు ప్రధాని మోదీ. గ్రామీణ ఉత్పత్తులు ఉపాధిని, ఉత్పత్తిని పెంచుతాయని పేర్కొన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: భారత్ బయోటెక్ 'చుక్కల టీకా' ట్రయల్స్కు అనుమతి