ETV Bharat / bharat

'భారత్​లో ఐసిస్'​పై ఎన్​ఐఏ గురి- 7 చోట్ల సోదాలు

author img

By

Published : Mar 15, 2021, 11:08 AM IST

ఐఎస్​ ఉగ్రవాద సంస్థలకు ప్రభావితం అయ్యారని అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లపై జాతీయ భద్రతా సంస్థ దాడులకు దిగింది. దిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది.

nia
దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ సోదాలు

జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తోంది. ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రవాద సంస్థకు సహకరించే వారే లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. దిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అనుమానితులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఎన్​ఐఏ వర్గాల సమాచారం.

దిల్లీలోని జాఫ్రాబాద్​ ప్రాంతం సహా బెంగళూరులోని రెండు ప్రాంతాల్లో ఎన్​ఐఏ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు కేరళలోని కోచి, కన్నూరులోని నాలుగు ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరపుతున్నారని ఎన్​ఐఏ వర్గాలు వెల్లడించాయి. అనుమానితులు అందరూ విద్యావంతులే అని, ఐఎస్​కు ప్రభావితం అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపాయి. విచారణ అనంతరం ఎన్​ఐఏ వీరిని అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ఇదీ చదవండి : సచిన్​ వాజేకు మార్చి 25 వరకు రిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.