సచివాలయానికి బాంబు బెదిరింపు- రైతు పనే!

author img

By

Published : May 30, 2021, 3:10 PM IST

Updated : May 30, 2021, 6:51 PM IST

maharastra secretariat bomb theaten

15:08 May 30

'మహా' సచివాలయానికి బాంబు బెదిరింపు

maharastra secretariat
మంత్రాలయ వద్ద భద్రత

ముంబయిలోని మహారాష్ట్ర సచివాలయంలో బాంబు ఉన్నట్టు వచ్చిన ఫోన్​ కాల్​లో నిజం లేదని తేలింది. సచివాలయ భవనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధరించారు. అనంతరం ఫోన్​ చేసిన వ్యక్తి వివరాలు ఆరా తీసి.. అతడ్ని నాగ్​పుర్​కు చెందిన రైతుగా గుర్తించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది...  

ఆదివారం మధ్యాహ్నం 12:40 గంటలకు మంత్రాలయ విపత్తు నిర్వహరణ కేంద్రానికి ఓ ఫోన్​ వచ్చింది. భవనంలో బాంబు పెట్టారని ఫోన్​లో చెప్పారు. బాంబు స్క్వాడ్​(బీడీడీఎస్​)తో పాటు పోలీసు సిబ్బంది సచివాలయానికి పరుగులు తీశారు. తనిఖీ నిర్వహించిన అనంతరం బాంబు లేదని నిర్ధరించారు.

ఈలోగా, ఫోన్​ చేసిన వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు అధికారులు. 

"రైతు పేరు సాంగర్​ మాంధ్రే(40). ఫోన్​ చేసిన రెండు గంటల్లోనే అతడిని పట్టుకున్నాము. 1997లో రైతు భూమిలోని కొంత భాగాన్ని ఓ సంస్థ కొనుగోలు చేసింది. దానికి రావాల్సిన పరిహారం ఇంకా అతడిని అందలేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు వినలేదని.. ప్రభుత్వ దృష్టిని తనవైపు తిప్పుకునేందుకే ఈ విధంగా చేసినట్టు ఆ రైతు వెల్లడించాడు."

 -- అధికారులు

Last Updated :May 30, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.