ETV Bharat / bharat

పన్నా టైగర్ రిజర్వులో ఆడపులి మృతి

author img

By

Published : May 17, 2021, 12:32 PM IST

మధ్యప్రదేశ్​లోని పన్నా టైగర్ రిజర్వులో ఓ ఆడపులి మరణించింది. పులి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. నమూనాలను కరోనా పరీక్షలకోసం పంపించామన్నారు.

Tigress died in Panna Tiger Reserve, feared to be corona infected
పన్నా టైగర్ రిజర్వులో ఆడపులి మృతి

మధ్యప్రదేశ్​లోని పన్నా టైగర్​ రిజర్వులో ఓ ఆడపులి మరణించింది. పులికి పంచనామా నిర్వహించి.. నమూనాలను కరోనా పరీక్షలకు పంపించామని అధికారులు తెలిపారు. పీ-213(32) ఆడపులి ఎడమ కాలుకు కొంతకాలం క్రితం గాయమైందని.. దీంతో పులి నడవలేని స్థితికి వచ్చిందన్నారు. ఆడపులికి నాలుగు పిల్లలు ఉన్నాయని వివరించారు. ఆడపులికి టైగర్​ రిజర్వులోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు ఫీల్డ్​ డైరెక్టర్ ఉత్తమ్ కుమార్​ శర్మ తెలిపారు.

Tigress died in Panna Tiger Reserv
పన్నా టైగర్​ రిజర్వు
Tigress died in Panna Tiger Reserve
మృతి చెందిన ఆడపులి..

పులి మృతికి కారణాలు తెలియకపోవటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర పులులను సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి : జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు తీవ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.