ETV Bharat / bharat

మొబైల్ మార్చి ఇవ్వలేదని షాపు యజమాని హత్య

author img

By

Published : Jun 13, 2021, 2:44 PM IST

మొబైల్​ ఫోన్​ రిప్లేస్​ చేయలేదని ఓ యువకుడు ఆగ్రహానికి గురయ్యాడు. షాపు యజమానిని హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

murder, MP
హత్య, మధ్యప్రదేశ్​

మొబైల్​ ఫోన్​ రిప్లేస్ చేయలేదని ఓ షాపు యజమానిని హత్య చేశాడు 19 ఏళ్ల కుర్రాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఖండవా ప్రాంతంలో జరిగింది.

ఇదీ జరిగింది..

కౌసర్ షా అనే కుర్రాడు కొన్ని రోజుల క్రితమే గులాబ్ పంబాబీ మొబైల్​ షాపులో రూ.1000తో ఓ ఫోన్​ కొన్నాడు. శనివారం ఆ ఫోన్​ సరిగా పనిచేయడం లేదని చెప్పి.. దానికి బదులుగా మరో మొబైల్​ ఇవ్వమని యజమానిని కోరాడు.

కొత్త ఫోన్​ ఇచ్చేందుకు పంజాబీ తిరస్కరించిన నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్ఘణ జరిగింది. ఈ క్రమంలో షాపులో ఉన్న కట్టర్​తో యజమానిని మెడపై పొడిచాడు నిందితుడు కౌసర్ షా. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైనట్లు ఎస్పీ వివేక్ తెలిపారు. శనివారం రాత్రి షాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మరుగుదొడ్డిలోనే నివాసం.. మనవరాలే సర్వస్వం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.