ETV Bharat / bharat

పిడుగుపాటుకు ఐదుగురు బలి

author img

By

Published : Jul 24, 2021, 7:09 PM IST

మధ్యప్రదేశ్​లో పిడిగుపాటుకు ఐదుగురు బలయ్యారు. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

lightening
పిడుగుపాటు, పిడుగుల బీభత్సం

మధ్యప్రదేశ్​ పన్నా జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు ఐదుగురు మృతిచెందారు. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఉరేహా, పిపరియా దౌన్, ఛౌముఖ, సిమ్రాఖుర్ద్ గ్రామాల్లో పిడుగుల ప్రభావం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉరేహా గ్రామంలో పొలంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. పింపరియా దౌన్, ఛౌముఖ, సిమ్రాఖుర్ద్ గ్రామాలకు చెందిన ఏడుగురికి తీవ్రంగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:ఉత్తర భారతంలో పిడుగుల బీభత్సం.. 68 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.