ETV Bharat / bharat

స్టీరింగ్ ఫెయిల్.. లోయలో పడి బస్సు రెండు ముక్కలు.. 26 మంది మృతి

author img

By

Published : Jun 6, 2022, 8:42 AM IST

Updated : Jun 6, 2022, 9:30 AM IST

Uttarakhand News: ఉత్తరాఖండ్​, ఉత్తరకాశీ జిల్లాలోని డామ్టా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. యమునోత్రి రహదారిపై 28 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు 200 మీటర్ల లోతు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

Uttarakhand Bus Accident
Uttarakhand Bus Accident

చార్​ధామ్​ యాత్రలో విషాదం

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. చార్‌ధామ్‌ యాత్రికులతో వెళుతున్న బస్సు ఒకటి 200 మీటర్ల లోతు లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 26 మంది మృత్యువాత పడ్డారు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బస్సులో డ్రైవరు, ఓ సహాయకుడు, 28 మంది యాత్రికులున్నారు. ఉత్తరకాశీ జిల్లా డామ్టా ప్రాంతంలోని యమునోత్రి ఎన్‌హెచ్‌-94పై ఈ దుర్ఘటన జరిగింది.

Uttarakhand Bus Accident
లోయలోపడి ధ్వంసమైన బస్సు
Uttarakhand Bus Accident
లోయిలో పడిన బస్సు

యాత్రికులంతా మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందినవారిగా పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. లోయలో పడిన తర్వాత బస్సు రెండు భాగాలుగా విడిపోయినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాద స్థలానికి వైద్యుల బృందంతోపాటు అంబులెన్సులు తరలించినట్లు జిల్లా కలెక్టర్‌ అభిషేక్‌ రుహేలా తెలిపారు. క్షతగాత్రులను డామ్టా, నౌగావ్‌లలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. పన్నా వాసులు మూడు బస్సుల్లో చార్‌ధామ్‌ యాత్రకు బయలుదేరగా.. ఇందులో ఒక బస్సు ప్రమాదానికి గురైంది.

Uttarakhand Bus Accident
సహాయక చర్యల దృశ్యాలు

సీఎం దిగ్భ్రాంతి.. యమునోత్రికి వెళ్తూ బస్సు లోయలోపడిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​. బస్సు స్టీరింగ్ ఫెయిల్​ అవ్వడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందని ఆయన​ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన నలుగురికి ఉచితంగా చికిత్స చేస్తున్నామని, దాంతో పాటు రూ.50 వేలు నగదు ఇస్తామని చెప్పారు. మరోవైపు.. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి పుష్కర్​సింగ్​ ధామీకి ఫోన్​ చేసి వివరాలు తెలుసుకున్నారు.

Uttarakhand Bus Accident
క్షతగాత్రులను పరామర్శిస్తున్న మధ్యప్రదేశ్​ సీఎం

రూ.2లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటన.. ఉత్తరకాశీలో జరిగిన బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతులు కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు.

ఇవీ చదవండి: మన జాతీయ గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

జననాల్లో తెలంగాణ.. మరణాల్లో ఆంధ్రప్రదేశ్​..

Last Updated : Jun 6, 2022, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.