ETV Bharat / bharat

Mother Threw her Four Children into Canal in Nagar Kurnool : కుటుంబ కలహాలతో నలుగురు పిల్లలను కాల్వలో పడేసిన తల్లి.. ముగ్గురు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 5:57 PM IST

Updated : Sep 16, 2023, 8:02 PM IST

Mother Threw her Four Children into Canal
Mother Threw her Four Children into Canal in Nagar Kurnool

17:51 September 16

Mother Threw her Four Children into Canal in Nagar Kurnool : కుటుంబ కలహాలతో నలుగురు పిల్లలను కాల్వలో పడేసిన తల్లి.. ముగ్గురు మృతి

Mother Threw her Four Children into Canal in Nagar Kurnool : కుటుంబ కలహాలతో తన కన్నపేగునే తుంచుకుంది ఓ తల్లి. దాంపత్య జీవితం అన్నాక గొడవలు సాధారణం.. కానీ మరీ కన్నపిల్లలను చంపేసే అంతగా ఏ తల్లి వ్యవహరించదు. ఏకంగా నలుగురు పిల్లలను కాలువలో పడేసి.. హతమార్చింది ఆమె. వీరిలో ముగ్గురు నీటిలో మునిగిపోయి అక్కడికక్కడే మృతి (Three Childrens Died) చెందగా.. మరో పిల్లాడి ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ హృదయవిషాదకర ఘటన నాగర్​కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం మంగనూరులో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని మంగనూరు గ్రామంలో శరవంద, లలిత ప్రేమ వివాహం చేసుకొని దాంపత్య జీవితం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి వీరి సంసార జీవితంలో కలతలు మొదలయ్యాయి. నిత్యం గొడవలతో సతమతమయ్యేవారు. ఇక రోజూ ఇదే పరిస్థితి ఎదురవడంతో జీవితంపై విసిరి లలిత తన నలుగురు పిల్లలను తీసుకొని ఉదయం బిజినేపల్లి పోలీస్​స్టేషన్​కు వెళ్లింది. అక్కడే పోలీస్​ స్టేషన్ పక్కన ఉన్న కేఎల్​ఐ కాలువ దగ్గర వెళ్లింది.

Boy Killed in School Bus Accident Hanamkonda : స్కూల్ వ్యాన్ కింద పడి మూడేళ్ల బాలుడు మృతి

Three Childrens Died in Nagarkurnool : ఆ కాలువలో పిల్లలు నలుగురి పడేసి.. ఆమె కూడా అందులో దూకేసింది. ఆమె దూకిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే తనను రక్షిస్తే సురక్షితంగా బయటపడింది. కానీ నలుగురు పిల్లలు నీటిలో మునిగిపోయారు. అందులో ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే చనిపోయి మృతదేహాలు పైకి కనిపించగా.. ఏడు నెలల కుమారుడి ఆచూకీ మాత్రం లభించలేదు. స్థానికులు ఎంత కాలువలో గాలించిన కుమారుడి మృతదేహం మాత్రం లభించలేదు. దీంతో ఆ ముగ్గురిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ఇంకా పూర్తి సమాచారం తేలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Two Boys Died After Falling Into Water Pit Nizamabad : ఆడుకుంటూ వెళ్లి.. నీటి గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి

Boy Died After Falling In Water Tank Mahabubabad : పండుగపూట విషాదం.. నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి

Last Updated : Sep 16, 2023, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.