ETV Bharat / bharat

బాత్​రూం​లో బిడ్డకు జన్మ.. శిశువును బకెట్​లో వదిలి ఆస్పత్రికి తల్లి.. చివరకు..

author img

By

Published : Apr 4, 2023, 10:30 PM IST

బాత్​రూం​లో బిడ్డకు జన్మనిచ్చి శిశువును బకెట్​లో విడిచి వెళ్లింది ఓ తల్లి. అనంతరం ఆసుపత్రికి చేరుకుంది. జరిగిన విషయాన్ని వైద్యులకు వివరించింది. దీంతో ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు వైద్యులు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చిన్నారి ప్రాణాలతో ఉండటాన్ని గమనించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శిశువు ప్రాణాలను కాపాడారు. మరోవైపు ఫేస్​బుక్​లో లైవ్ స్ట్రీమ్​ పెట్టి.. వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహరాష్ట్రలో జరిగిందీ ఘటన.

mother-abandoned-newborn-baby-in-bucket-police-rescued-newborn-baby-abandoned
నవజాత శిశువును బకెట్‌లో విడిచి పెట్టిన తల్లి

ఇంట్లోని బాత్​రూం​లో బిడ్డకు జన్మనిచ్చి శిశువును బకెట్​లో విడిచి వెళ్లింది ఓ తల్లి. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి చేరుకొని... బిడ్డను బాత్​రూం​లో విడిచివచ్చిన విషయాన్ని వైద్యులకు తెలిపింది. దీనిపై డాక్టర్లు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే శిశువు ఉన్న ఇంటికి వెళ్లిన పోలీసులు.. చిన్నారి ప్రాణాలను కాపాడారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగన్నూరు పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ములకుజ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన ఇంట్లో శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆ చిన్నారిని బాత్​రూంలో ఉన్న బకెట్​లో విడిచిపెట్టింది. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను గమనించిన ఆసుపత్రి వైద్యులు.. ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో విషయాన్ని మొత్తం డాక్టర్లకు చెప్పింది మహిళ. బిడ్డ చనిపోయిందని భావించి అక్కడ వదిలి వచ్చినట్లు వివరించింది. వెంటనే ఆ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు వైద్యులు.

హుటాహుటిన యువతి ఇంటికి చేరుకున్న పోలీసులు.. బకెట్​లో చిన్నారిని గుర్తించారు. శిశువు బతికే ఉండటాన్ని గమనించారు. ఆలస్యం చేయకుండా చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆ చిన్నారి కొట్టాయం మెడికల్ కాలేజీ హాస్పిటల్​లో చికిత్స పొందుతోంది. వైద్యులు శిశువును ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించడం వల్ల.. చిన్నారి ప్రాణాలు నిలిచాయి. దీంతో పోలీసులు చేసిన పనికి ప్రశంసలు అందుతున్నాయి.

ఫేస్​బుక్​లో లైవ్ స్ట్రీమ్​ పెట్టి.. ఉరివేసుకున్న వ్యక్తి..
మహరాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఫేస్​బుక్​లో లైవ్ స్ట్రీమ్​ పెట్టి.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ ఫేస్​బుక్​ లైవ్​ స్ట్రీమ్ నడిచింది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని కృతంక్ సిద్ధార్థ్ డోంగ్రే(27)గా పోలీసులు గుర్తించారు. అతడు నాగ్​పుర్​లోని కాంప్టీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. సిద్ధార్థ్ మద్యానికి బానిస అయ్యాడని పోలీసులు తెలిపారు. అతనికి ఉద్యోగం కూడా లేదని వారు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం సిద్ధార్థ్​కు.. అతని భార్యతో గొడవ జరిగిందని తెలిపారు. దీంతో ఆమె భర్తను విడిచిపెట్టి వెళ్లిందని పోలీసులు పేర్కొన్నారు.

సోమవారం సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు పనిమీద బయటకు వెళ్లారు. అదే రోజు అర్ధరాత్రి 1.30 గంటల సమయానికి తన మొబైల్​లో భార్య ఫేస్​బుక్​ ఖాతాకు లాగిన్​ అయ్యాడు. లైవ్​ స్ట్రీమింగ్​ పెట్టి.. ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో బాగా వైరల్​ అయింది. దీంతో పోలీసులతో సహా.. సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.