'పండగలు శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యానికి సూచిక'

author img

By

Published : Jan 14, 2022, 10:54 AM IST

Modi, Venkaiah Wishes to Festivals

Modi Wishes to Festivals: మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్​, పొంగల్​ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పండుగలు శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యానికి సూచిక అని ప్రధాని ట్వీట్​ చేశారు. మరోవైపు భోగి పండుగ సకల జనులకు ఆ భగవంతుడు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కలిగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

Modi Wishes to Festivals: మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్​, పొంగల్​, భోగీని పురస్కరించుకుని దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచిస్తాయని మోదీ పేర్కొన్నారు.

  • Bhogi greetings to everyone. May this special festival enrich the spirit of happiness in our society. I pray for the good health and well-being of our fellow citizens. pic.twitter.com/plBUW3psnB

    — Narendra Modi (@narendramodi) January 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్​, పొంగల్​, భోగి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉన్న ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను" అని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

'సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి'

భోగి పండుగ సందర్భంగా సకల జనులకు ఆ భగవంతుడు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కలిగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చెన్నై కోట్టూర్ పురంలోని స్వగృహం వద్ద వెంకయ్యనాయుడు దంపతులు భోగిమంటలు వేశారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు.

  • భోగి పండుగ సందర్భంగా చెన్నై కోట్టూర్ పురంలోని స్వగృహం వద్ద భోగిమంటలు వేస్తున్న గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, వారి సతీమణి శ్రీమతి ఉషమ్మ. #Bhogi2022 pic.twitter.com/X2Hitinrlo

    — Vice President of India (@VPSecretariat) January 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దేశ ప్రజలకు భోగి శుభాకాంక్షలు. ప్రతికూల ఆలోచనలు వదిలి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలనే సందేశాన్నిచ్చే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నూతన కాంతులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను."

- ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

ఇదీ చూడండి: ఐదేళ్లుగా మంచానికే పరిమితం- కొవిషీల్డ్​ టీకా తీసుకున్నాక లేచి నిలబడ్డాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.