ETV Bharat / bharat

Miss Ocean World 2023 : 'సాగరకన్య'గా ముంబయి సుందరి.. 'మిస్ ఓషన్ వరల్డ్' పోటీల్లో టాప్!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 7:51 AM IST

Updated : Oct 22, 2023, 9:06 AM IST

Miss Ocean Competition World 2023 : ముంబయికి చెందిన అవంతి ష్రాఫ్ అనే యువతి.. 2023 మిస్ ఓషన్ వరల్డ్ పోటీల్లో రన్నరప్​గా నిలిచారు. యూకేకు చెందిన లారా మొదటి స్థానం సంపాదించారు. రాజస్థాన్​లో జైపుర్​ చోము ప్యాలెస్​లో ఈ పోటీలు జరిగాయి. సముద్రాలను కాలుష్య రహితంగా మార్చడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యం.

Miss Ocean Competition World 2023
మిస్ ఓషన్ వరల్డ్ పోటీ 2023

Miss Ocean Competition World 2023 : 2023 మిస్ ఓషన్ వరల్డ్ పోటీల్లో ముంబయికి చెందిన అవంతి ష్రాఫ్ అనే యువతి రన్నరప్​గా నిలిచారు. మొత్తం 12 దేశాలకు చెందిన అందగత్తెలు.. ఈ పోటీల్లో పాల్గొనగా.. యూకేకు చెందిన లారా మొదటి స్థానం సంపాదించారు. రాజస్థాన్​ జైపుర్​లోని చోము ప్యాలెస్​లో ఈ పోటీలు జరిగాయి. భారత్​లో ఈ పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా ఫస్ట్​ రన్నరప్​గా బల్గేరియాకు చెందిన ఆండ్రియా నిలవగా.. సెకండ్​ రన్నరప్​గా అవంతి ష్రాఫ్ విజయం సాధించారు.

మొత్తం 12 దేశాల నుంచి 12 మంది పోటీదారులు ఈ మిస్ ఓషన్ వరల్డ్-2023 పోటీల్లో పాల్గొన్నారు. అన్ని రౌండ్లు దాటుకుని అవంతి ష్రాఫ్ రన్నరప్​గా నిలిచారు. తాను గతంలో చాలా పోటీల్లో పాల్గొన్నప్పటికీ.. ఈ పోటీలు చాలా ప్రత్యేకమైనవి ఆమె పేర్కొన్నారు. క్రితం పోటీల్లో తన కోసం మాత్రమే పాల్గొన్నట్లు అవంతి తెలిపారు. కానీ మిస్ ఓషన్ వరల్డ్ 2023లో మాత్రం దేశం కోసం గెలవాలనుకున్నట్లు ఆమె వెల్లడించారు. అందుకే ఈ పోటీల్లో తాను కాస్త ఒత్తిడికి గురైనట్లు ఆమె వివరించారు.

"ఈ పోటీల్లో.. 'సముద్ర తీరాన్ని కాపాడేందుకు మీరు ఏ విధంగా కృషి చేస్తారు' అనే ప్రశ్నను నిర్వహకులు నన్ను అడిగారు. ముంబయిలో ఉంటూ వివిధ సామాజిక సంస్థలతో కలిసి.. బీచ్​లను శుభ్రం చేసే చాలా కార్యక్రమాలలో నేను పాల్గొన్నాను. అదే విషయాన్ని వారికి చెప్పాను. ఆ అనుభవం ఈ పోటీల్లో నాకు బాగా పనికొచ్చింది" అని అవంతి చెప్పుకొచ్చారు. ఈ పోటీల్లో రాణించడం చాలా సంతోషంగా ఉందని ఆమె వివరించారు.

ఏంటీ మిస్ ఓషన్ వరల్డ్ పోటీలు?
ఈ పోటీలు పోటీదారుల అందాన్ని, టాలెంట్​ను చూపించడం కోసం మాత్రమే కాదని.. పర్యావరణంపై అవగాహనను ప్రోత్సహించేందుకు కూడా సహాయపడుతుందని నిర్వహకులు వెల్లడించారు. సముద్రాలను శుభ్రంగా, కాలుష్య రహితంగా మార్చడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని వారు వివరించారు. ఈ షో ద్వారా సముద్రాలు, తీర ప్రాంతాల పరిరక్షణ గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమన్నారు.

ప్రపంచంలో ఈమే అత్యంత 'అందమైన బామ్మ'!

తాజ్​మహల్ వద్ద అందాల ప్రదర్శన.. 35 దేశాల సుందరీమణుల సందడి

Last Updated :Oct 22, 2023, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.