ETV Bharat / bharat

ఏనుగును కాపాడేందుకు వెళ్లి.. నదిలో కొట్టుకుపోయి...

author img

By

Published : Sep 24, 2021, 3:47 PM IST

Updated : Sep 24, 2021, 5:28 PM IST

Mishap during Tusker rescue ops in Mahanadi river barrage
ఏనుగును కాపాడేందుకు వెళ్లి

నీటిలో చిక్కుకున్న ఏనుగును కాపాడేందుకు వెళ్లిన అధికారులు.. మహానదిలో కొట్టుకుపోయారు. నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా.. వారి పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ఓ పాత్రికేయుడు ప్రాణాలు కోల్పోయారు.

ఏనుగును కాపాడేందుకు వెళ్లి కొట్టుకుపోయిన సిబ్బంది..

ఒడిశా కటక్​లోని మహానదిలో చిక్కుకున్న ఏనుగును కాపాడేందుకు వెళ్లిన విపత్తు స్పందన దళానికి (ఓడీఆర్​ఏఎఫ్​) చెందిన పడవ నీటిలో మునిగిపోయింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా.. సహాయక సిబ్బంది సహా మీడియాకు చెందిన మరో ఇద్దరు అందులో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న ఇతర విపత్తు దళ సిబ్బంది.. తాళ్ల సాయంతో వారిని బయటకు తీశారు. కటక్​లోని ఆస్పత్రులకు తరలించారు.

దురదృష్టవశాత్తు.. ఓ పాత్రికేయుడు ప్రాణాలు కోల్పోయారు.

11 ఏనుగులు నది దాటుతుండగా..

నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సమయంలోనే.. 11 ఏనుగుల గుంపు మహానది దాటేందుకు ప్రయత్నించాయి. 10 ఏనుగులు ఎలాగోలా అవతలి ఒడ్డుకు చేరగా.. ఒకటి మాత్రం ముండాలి బ్రిడ్జ్​ వద్ద చిక్కుకుపోయింది. కాపాడేందుకు విపత్తు నిర్వహణా బృందాలు ప్రయత్నించగా.. పడవ మునిగిపోయింది.

ఇవీ చూడండి: పట్టపగలే కోర్టులో కాల్పులు.. ముగ్గురు మృతి

మరణించిన 14 రోజులకు అంత్యక్రియలు- ఆత్మ ఇప్పుడే వీడిందని...

Last Updated :Sep 24, 2021, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.