పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్​.. గన్​తో బెదిరించి గ్యాంగ్​ రేప్

author img

By

Published : Dec 6, 2021, 5:23 PM IST

UP Gang rape

Uttar Pradesh Gang Rape: ఓ బాలికను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కిరాతకులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ సహారన్​పుర్​ జిల్లాలో జరిగింది.

Gangrape latest news: ఉత్తర్​ప్రదేశ్​ సహారన్​పుర్​ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ బాలికను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. గంగోహ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది ఈ ఘటన.

ఇదీ జరిగింది

పదో తరగతి విద్యార్థిని తన ఇంటి బయట తడుచుకుంటుండగా.. పొరుగున ఉన్న ఓ యువకుడు, అతని సోదరుడు వెళ్లి.. తుపాకీతో బెదిరించి అపహరించారు. బాధితురాలిని తమ ఇంటికి తీసుకెళ్లి.. ఆమెకు మత్తుమందు ఇచ్చారు. స్పృహ కోల్పోగానే అత్యాచారం చేశారు.

కొద్ది సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన బాలిక.. తిరిగి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికకు వైద్యపరీక్షలు చేయించి, విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: నడిరోడ్డుపై రెచ్చిపోయిన దుండగులు- రాడ్డుతో కాళ్లు, చేతులు విరగ్గొట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.