ETV Bharat / bharat

శ్రీనగర్​లో కశ్మీర్ పండిట్​పై ముష్కరుల కాల్పులు

author img

By

Published : Apr 4, 2022, 10:45 PM IST

Militants attack srinagar: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. సోమవారం సాయంత్రం కశ్మీర్​ పండిట్​పై కాల్పులు జరిపారు. ఈ ఘటన ​​శ్రీనగర్​లో జరిగింది.

Militants
పౌరుడిపై ఉగ్రదాడి

Militants attack srinagar: జమ్ముకశ్మీర్​లో ముష్కరులు రెచ్చిపోయారు. సోను కుమార్ బల్జీ అనే కశ్మీర్​ పండిట్​పై కాల్పులు జరిపారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. బాధితుడికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. బాధితుడు దక్షిణ కశ్మీర్​లోని షోపియాన్ జిల్లాకు చెందిన వాడని చెప్పారు. చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.

దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఆ ప్రాంతాన్ని నిర్బంధించి గాలింపు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో లోయలో ఇది నాల్గవ ఉగ్రదాడి అని అధికారులు చెప్పారు. అంతకుముందు.. ఇద్దరు స్థానికేతరులపై పుల్వామాలో దాడి చేశారు ముష్కరులు. వీరు గాయాలతో బయటపడ్డారు. శ్రీనగర్​లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్ఫీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: భూతగాదాలో పేలిన తూటాలు.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.