ETV Bharat / bharat

మరోసారి ముఫ్తీ, ఇల్తీజా గృహ నిర్బంధం!

author img

By

Published : Nov 27, 2020, 1:58 PM IST

Mehbooba Mufti, daughter allegedly put under house arrest
వాళ్ల క్రూరత్వానికి అడ్డూ అదుపూ లేదు: ముఫ్తీ

తనను, తన కుమార్తె ఇల్తీజాను మరోసారి గృహ నిర్బంధం చేశారని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. వహీద్​ పర్రా కుటుంబ సభ్యులను కలిసేందుకు తమను అధికారులు అనుమతించడం లేదని అన్నారు.

జమ్ముకశ్మీర్​ అధికార యంత్రాంగం తనను, తన కుమార్తె ఇల్తీజాను మరోసారి గృహ నిర్బంధం చేసిందని ఆరోపించారు పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. పుల్వామాలోని వహీద్​ పర్రా​ కుటుంబాన్ని కలిసేందుకు.. రెండురోజులుగా తమకు అనుమతినివ్వడం లేదని అన్నారు. వహీద్​ పర్రాను నిరాధార ఆరోపణలతో ఎన్​ఐఏ అరెస్టు చేసిందని ఆమె వ్యాఖ్యానించారు.

"నన్ను మరోసారి అక్రమంగా గృహ నిర్బంధం చేశారు. వాళ్ల క్రూరత్వానికి అదుపు లేదు. వహీద్​ పర్రాను నిరాధార ఆరోపణలతో అరెస్టు చేశారు. పుల్వామాలోని వహీద్​ కుటుంబ సభ్యులను కలిసేందుకు జమ్ముకశ్మీర్​ అధికార యంత్రాంగం రెండు రోజులుగా అనుమతించటం లేదు. భాజపా మంత్రులు, కార్యకర్తలు కశ్మీర్​లో ఎక్కడికైనా వెళ్లగలరు. కానీ, నా విషయంలో మాత్రమే వారికి భద్రతా సమస్యలు ఎదురొస్తాయి. నా కుమార్తె ఇల్తీజాను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు."

--మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి

వహీద్​ పర్రా పీడీపీ నేత. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ముఫ్తీ విజయానికి సహకరించాలని హిజ్బుల్ ముజాహిద్దీన్​ ఉగ్రసంస్థతో చర్చలు జరపారన్న ఆరోపణలపై పర్రాను ఎన్​ఐఏ అరెస్టు చేసింది.

'వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాస్తున్నారు'

ముఫ్తీ నిర్బంధంపై జమ్ముకశ్మీర్​ మాజీ సీఎం, నేషనల్​ కాన్ఫరెన్స్​ ఉపాధ్యక్షుడు ఒమర్​ అబ్దుల్లా స్పందించారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం తమ అధీనంలో ఉంచుకుంటోందని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థ జోక్యం ఏ మాత్రం లేకుండా తమ ఇష్టానుసారం ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఇదీ చూడండి:రైతుల 'ఛలో దిల్లీ' మార్చ్​లో​ మరోసారి ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.