ETV Bharat / bharat

దిల్లీకి 70 టన్నుల ఆక్సిజన్​

author img

By

Published : Apr 27, 2021, 11:38 AM IST

oxygen
ఆక్సిజన్​

దిల్లీలో కరోనా విలయం సృష్టిస్తోన్న వేళ ఎక్స్​ప్రెస్​ రైలు ద్వారా 70 టన్నుల ఆక్సిజన్ చేరవేసినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్​గఢ్​లోని రాయ్​గడ్​ నుంచి రెండు క్రితం రోజుల బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం ఉదయం దిల్లీకి చేరుకున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

70 టన్నుల ఆక్సిజన్‌తో మొట్టమొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం తెల్లవారుజామున దిల్లీకి చేరుకుంది. అక్కడి నుంచి దిల్లీ సర్కారు..హస్తినలో అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైన ఆస్పత్రులకు ఈ ప్రాణవాయువు ట్యాంకర్లను తరలిస్తోంది. సర్‌ గంగారామ్ ఆస్పత్రికి 2 టన్నుల ప్రాణవాయువు సరఫరా చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్​లోని రాయ్‌గడ్‌ నుంచి రెండు రోజుల క్రితం బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు.. మంగళవారం ఉదయం దిల్లీకి చేరుకున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. హస్తినలో కరోనా విలయం సృష్టిస్తున్న వేళ ఆక్సిజన్ కొరతతో ఇప్పటికే పదుల్లో రోగులు మరణించారు. ఈ పరిస్థితుల్లో అంగుల్‌, కాలీనగర్‌, రౌర్కెలా, రాయ్‌గడ్‌ నుంచి ఆక్సిజన్ తరలించేందుకు రైల్వే ఏర్పాట్లు చేసింది. మొదటి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్.. దిల్లీకి మంగళవారం తెల్లవారుజామున వెళ్లగా.. తదుపరి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌పై రైల్వే సమాచారం ఇవ్వలేదు.

ఇదీ చూడండి: ఆక్సిజన్​ లేక భర్తకు నోటితో ఊపిరూదిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.