ETV Bharat / bharat

లిఫ్ట్​ ఇస్తామని.. వివాహితపై సామూహిక అత్యాచారం

author img

By

Published : Mar 28, 2021, 5:43 PM IST

Woman raped by three men in Rajasthan
లిఫ్ట్​ ఇస్తామని చెప్పి.. వివాహితపై అత్యాచారం

ఓ మహిళకు లిఫ్ట్​ ఇస్తానని చెప్పి.. ముగ్గురు దుండగులు అత్యాచారం చేశారు. ఈ ఘటన రాజస్థాన్​లో శనివారం వెలుగు చూసింది.

రాజస్థాన్​లో ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఆమె శనివారం సాయంత్రం సొంతూరికి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది.

ఏం జరిగిందంటే?

బాడ్మేర్​ జిల్లాకు చెందిన ఓ వివాహిత తన బిడ్డతో పాటు ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అవుతూ నగరంలో నివాసముంటోంది. వారాంతం కావడం వల్ల.. సమీపంలోని స్వగ్రామానికి బయల్దేరింది. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు లిఫ్ట్​ ఇస్తామని చెప్పి ఆమెను వెంబడించారు. అనంతరం అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటన సమయంలో తన బిడ్డను బంధించడం సహా.. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారని బాధితురాలు పేర్కొంది.

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఓ నిందితుడ్ని అరెస్టు​ చేశారు పోలీసులు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: కరోనాను లెక్కచేయకుండా హోలీ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.