ETV Bharat / bharat

ఆ చిన్నారికి పాలిచ్చేందుకు కదిలొచ్చిన తల్లులు!

author img

By

Published : May 30, 2021, 4:58 PM IST

nagpur, child
చిన్నారి,నాగ్​పుర్

ప్రసవ సమయంలో గుండెపోటుతో మరణించిన కొవిడ్ రోగి బిడ్డ ఆకలి తీర్చేందుకు ఎందరో తల్లులు ముందుకొచ్చారు. ఆ చిన్నారికి బ్రెస్ట్​ఫీడింగ్ చేశారు. ఈ ఘటన నాగ్​పుర్​లో జరిగింది.

ప్రసవ సమయంలో గుండెపోటుతో మరణించింది ఓ కొవిడ్ రోగి. మరోవైపు.. పుడుతూనే పాల కోసం ఏడుస్తోంది ఆమెకు జన్మించిన చిన్నారి. ఆ చిన్నారి ఆకలి బాధను చూడలేక.. కృష్ణుడిని పెంచిన యశోదలా ఎందరో తల్లులు ముందుకువచ్చారు. బ్రెస్ట్​ఫీడింగ్​ చేస్తూ దయాహృదయం చాటుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగింది.

child, nagpur
చిన్నారితో తన తండ్రి

ఇదీ జరిగింది..

నాగ్​పుర్​కు చెందిన మీనల్ వెర్నెకర్​కు, ఠాణెకు చెందిన చేతన్​తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇరువురూ ఠాణెలో నివసిస్తున్నారు. అయితే.. గర్భవతి అయ్యాక డెలివరీ నిమిత్తం మీనల్​ నాగ్​పుర్​లోని తన అమ్మవాళ్లింటికి వెళ్లింది. ఎనిమిదో నెల రాగానే మీనల్​కు కరోనా సోకింది. వెంటనే కింగ్స్​వే ఆసుపత్రిలో చేర్పించారు ఆమె తల్లితండ్రులు.

ప్రసవించే సమయంలో మీనల్​ గుండెపోటుతో మరణించింది. అయినప్పటికీ చివరి నిమిషాల్లో.. వైద్యులు జాగ్రత్తగా ఆపరేషన్​ చేసి మీనల్​ బిడ్డకు ఆయువు పోశారు.

child, nagpur
చిన్నారి

ఎందరో తల్లులై..

మీనల్​.. మరణించడానకి ముందు తనకు పుట్టబోయే బిడ్డకు ఇవాన్ అని పేరు పెట్టాలని ఆశించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్​ అనంతరం.. ఇవాన్​ తల్లి పాలు మాత్రమే తాగాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో.. ఎందరో మహిళలు ఆ పసిబిడ్డకు బ్రెస్ట్​ఫీడింగ్​ చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఇవాన్​ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మరో రెండు నెలల పాటు చిన్నారి తల్లి పాలు మాత్రమే తాగాలని అన్నారు.

ఇదీ చదవండి:ప్రముఖ యూట్యూబర్ సాపట్టు రమణ్​ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.