ETV Bharat / bharat

మన్మోహన్​కు సెలవులు మంజూరు చేసిన వెంకయ్య

author img

By

Published : Dec 2, 2021, 3:17 PM IST

PM Manmohan Singh
మన్మోహన్​ సింగ్, వెంకయ్య నాయుడు

Manmohan Singh Health: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరుకాలేనని తెలిపిన మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​కు సెలవులు మంజూరు చేశారు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Manmohan Singh Health: మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్​ మన్మోహన్​ సింగ్​కు సెలవులు మంజూరు చేశారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్లమెంటు శీతాకాల సమావేశాలకు గైర్హాజరయ్యేందుకు అనుమతించారు. సెలవులకు సంబంధించిన దరఖాస్తు​ ఛైర్మన్​ టేబుల్​ వద్దకు వచ్చిన తర్వాత ఈ ప్రకటన చేశారు వెంకయ్య.

" డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ నుంచి లేఖ అందింది. అనారోగ్య కారణాలతో శీతాకాల సమావేశాలకు హాజరుకాలేనని అందులో పేర్కొన్నారు. అందుకు అనుమతిస్తున్నాం. నవంబర్​ 29 నుంచి డిసెంబర్​ 23 వరకు జరుగుతున్న మొత్తం శీతాకాల సమావేశాలకు సెలవులు మంజూరు చేస్తున్నాం. "

- వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్​.

89 ఏళ్ల మన్మోహన్​ సింగ్​కు కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. గుండె సంబంధింత సమస్యలతో గత అక్టోబర్​లో దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు సింగ్​. అంతకుముందు పలుమార్లు బైపాస్​ సర్జరీలు జరిగాయి.

ఇదీ చూడండి: ఎంపీల సస్పెన్షన్​పై వెంకయ్య కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.