ETV Bharat / bharat

తోసేశాడని.. తలపై రాడ్డుతో కొట్టి దారుణ హత్య!

author img

By

Published : Feb 18, 2022, 7:04 AM IST

Mumbai news
liquor shop

Man Killed for Pushing Customer: లిక్కర్​ షాప్​ వద్ద తనను నెట్టివేసిన ఓ యువకుడిని దారుణంగా రాడ్డుతో కొట్టి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది.

Man Killed for Pushing Customer: మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. తనను నెట్టివేశాడని ఓ యువకుడిని అతి కిరాతకంగా రాడ్డుతో కొట్టి చంపాడు ఓ వ్యక్తి.

ఇదీ జరిగింది..

రాజేశ్ భలోతియా అనే 23 ఏళ్ల యువకుడు.. మద్యం దుకాణం నుంచి బయటకు వస్తుండగా.. రాజేశ్​ వాఘ్​మరే అనే వ్యక్తిని పక్కకు జరగమనే ఉద్దేశంతో కాస్త నెట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన వాఘ్​మరే.. భలోతియాను అక్కడికక్కడే రాడ్డుతో తలపై మోదాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై షాప్​ ఓనర్.. పోలీసులకు సమాచారం అందించారు.

భలోతియాను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. నిందితుడు వాఘ్​మరేను పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: 'పిల్లలు, మహిళల్ని చేతులు కట్టేసి కొట్టిన పోలీసులు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.