ETV Bharat / bharat

'కాంగ్రెస్‌ వల్లే మోదీ మరింత పవర్‌ఫుల్‌'

author img

By

Published : Oct 30, 2021, 1:58 PM IST

Updated : Oct 30, 2021, 3:23 PM IST

Mamata Banerjee Goa
మమతా బెనర్జీ

కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. రాజకీయాల పట్ల కాంగ్రెస్‌ సీరియస్‌గా ఉండట్లేదని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ మరింత శక్తిమంతంగా మారుతున్నారని పేర్కొన్నారు. గోవా పర్యటన (Mamata Banerjee Goa) సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు దీదీ.

రాజకీయాల పట్ల కాంగ్రెస్‌ సీరియస్‌గా ఉండట్లేదని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ మరింత శక్తిమంతంగా మారుతున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. గోవా పర్యటనలో(Mamata Banerjee Goa) ఉన్న దీదీ.. అక్కడ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే అవసరాన్ని కాంగ్రెస్‌ గుర్తించట్లేదని దుయ్యబట్టారు.

" కాంగ్రెస్‌ రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఆ పార్టీ వల్లే మోదీజీ మరింత శక్తిమంతంగా మారుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌.. భాజపాకు టీఆర్‌పీగా మారుతోంది. ఇప్పటికైనా వారు(కాంగ్రెస్‌) నిర్ణయం తీసుకోకపోతే.. యావత్ దేశం బాధపడాల్సి వస్తుంది. వారికి గతంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ, వారు భాజపాపై పోరాటం చేయాల్సింది మాని.. మా రాష్ట్రంలో నాపై పోటీ చేశారు. అలాంటప్పుడు మేం వారితో ఎలా చేతులు కలపగల్గుతాం"

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

కేంద్రంపై విమర్శలు

కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు మమత. 'అచ్చేదిన్' (మంచిరోజులను) తెస్తామన్న కేంద్రం.. ఇప్పుడు దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. ఇంధన ధరల పెంపు, జీఎస్​టీ వ్యాపారాలపై ప్రభావం చూపాయని.. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొన్నారు. ఎగుమతులు కూడా క్షీణించాయని తెలిపారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు (Mamata Banerjee Goa) భాజపా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని వ్యాఖ్యానించారు.

'ఓట్లు చీలకూడదు'

గోవా ఫార్వర్డ్​ పార్టీ అధ్యక్షుడు విజయ్​ సర్దేశాయ్​తో మమత (Mamata Banerjee Goa) శనివారం భేటీ అయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు ఇరు పక్షాలు కలిసి పనిచేయాలని ప్రతిపాదించినట్లు దీదీ వెల్లడించారు. ఓట్ల చీలికను తమ పార్టీ నివారించాలని భావిస్తోందని.. దీని వల్ల ప్రాంతీయ పార్టీలకు కూడా భాజపాపై పోరాడేందుకు అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి : 'అక్కడ ఇంజినీరింగ్​ చేయాలంటే ఎన్​ఓసీ తప్పనిసరి'

Last Updated :Oct 30, 2021, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.