ETV Bharat / bharat

కరోనా కట్టడికి కేరళలో లాక్​డౌన్

author img

By

Published : May 6, 2021, 11:32 AM IST

Updated : May 6, 2021, 12:31 PM IST

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ.. కేరళలో లాక్​డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 8 ఉదయం 6 గంటల నుంచి ఆంక్షలు అమలవుతాయని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.

Lockdown to be imposed in the state from 6 am on May 8 to May 16,
కరోనా కట్టిడికి కేరళలో లాక్​డౌన్

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేరళలో పూర్తి స్థాయి లాక్​డౌన్ విధించింది విజయన్ సర్కార్. కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మే 8 నుంచి 16 వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. మే 16 వరకు లాక్​డౌన్ కొనసాగుతుందని కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.

ఇప్పటికే రాష్ట్రంలో లాక్​డౌన్ తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి లాక్​డౌన్​వైపు సర్కారు మొగ్గుచూపింది.

బుధవారం కేరళలో గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. బుధవారం ఏకంగా 41,953 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది.

ఇదీ చదవండి: అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌!

Last Updated : May 6, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.