ETV Bharat / bharat

ఒక్కరోజే 2 లక్షల 61 వేల కేసులు- 1500 మరణాలు

author img

By

Published : Apr 18, 2021, 9:35 AM IST

Updated : Apr 18, 2021, 10:46 AM IST

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,61,500 మందికి వైరస్ సోకగా.. 1501 మంది మరణించారు. లక్షా 23 వేల మందికిపైగా వైరస్​ను జయించారు.

corona
కరోనాఒక్కరోజే 2 లక్షల 61 వేల కేసులు

దేశంలో కొవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. కొత్తగా 2,61,500 మందికి వైరస్​​ సోకింది. మరో 1,501 మంది చనిపోయారు. 1,38,423 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • మొత్తం కేసులు: 1,47,88,109
  • మొత్తం మరణాలు: 1,77,150
  • మొత్తం కోలుకున్నవారు: 1,28,09,643
  • యాక్టివ్​ కేసులు: 18,01,316

దేశంలో మొత్తంగా 12 కోట్ల 26 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

కొవిడ్​ వ్యాప్తి కట్టడిలో భాగంగా శుక్రవారం ఒక్కరోజే 15,66,394 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్​ టెస్ట్​ల సంఖ్య 26 కోట్ల 65 లక్షలు దాటింది.

ఇదీ చదవండి: టీకాతో ఇన్​ఫెక్షన్ ఆగదు..!

ఇదీ చదవండి: రెమ్‌డెసివిర్‌ మంత్రదండం కాదు: గులేరియా

Last Updated : Apr 18, 2021, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.