ETV Bharat / bharat

Lakhimpur Kheri Violence : లఖింపుర్​ ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Oct 27, 2021, 7:25 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరి హింసాకాండలో (Lakhimpur Kheri Violence) భాజపా కార్యకర్తలపై దాడి చేసిన ఇద్దరిని పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేశారు. మరోవైపు ఈ ఘటనలో ప్రధాన నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్​​ మిశ్రా డెంగీ నుంచి కోలుకోవడంతో తిరిగి జైలుకు తరలించారు.

Lakhimpur Kheri Violence
లఖింపుర్​ ఘటన

ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ ఖేరి హింసాకాండకు (Lakhimpur Kheri Violence) సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

భాజపా కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనం.. నలుగురు రైతులను ఢీకొనగా వారు చనిపోయిట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోపోద్రిక్తులైన రైతులు వాహనంలో ఉన్న కొందరిని చితకబాదారు. వారిలో ఇద్దరు భాజపా కార్యకర్తలు, డ్రైవర్​ సహా మరో జర్నలిస్ట్​ కూడా మృతి చెందారు.

ఈ కేసుకు సంబంధించి గుర్విందర్ సింగ్​, విచిత్ర సింగ్‌ అనే ఇద్దరిని తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. ఈ నెల 4న సుమిత్ జైస్వాల్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు... వారిని అరెస్ట్​ చేసినట్లు ఓక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆసుపత్రి నుంచి జైలుకు ఆషిశ్​ మిశ్రా..

లఖింపుర్​ ఖేరి ఘటనలో ప్రధాన నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా (Ajay Mishra Lakhimpur) కుమారుడు ఆశిష్​ మిశ్రాను (Ashish Mishra Lakhimpur) అధికారుల తిరిగి జైలుకు తరలించారు. డెంగీ బారిన పడిన ఆయనను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించిన అధికారులు.. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్​ చేస్తున్న వాంఖడే: మంత్రి మాలిక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.