lakhimpur violence news: గృహ నిర్బంధంలో ప్రియాంక నిరాహార దీక్ష

author img

By

Published : Oct 4, 2021, 3:48 PM IST

Updated : Oct 4, 2021, 4:06 PM IST

lakhimpur-kheri-priyanka-gandhi-on-hunger-strike-following-detention

ఉత్తర్​ప్రదేశ్​లో నిరాహార దీక్ష చేపట్టారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(priyanka gandhi news today). లఖింపుర్​ హింసాత్మక ఘటన(lakhimpur kheri news today) నేపథ్యంలో ప్రియాంక దీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ హింసాత్మక ఘటనపై(lakhimpur kheri incident) నిరసనగా నిరాహార దీక్షకు దిగారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(priyanka gandhi news today). లఖింపుర్​కు వెళ్తున్న నేపథ్యంలో ఆమెను పోలీసులు సితాపుర్​ వద్ద అరెస్టు చేయగా.. అక్కడే ఆమె నిరాహార దీక్ష చేపట్టినట్టు పార్టీ ప్రకటించింది.

హింసాత్మక ఘటనలో మృతిచెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు గాంధీ(up news priyanka gandhi) వెళ్లారు. ఆమె వెంట కాంగ్రెస్​ నేతలు కూడా ఉన్నారు. అయితే రైతుల కుటుంబాలను చూడనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీతాపుర్​లోని ఓ అతిథి గృహానికి తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు.

"కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అరెస్టు చేశారు. ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు నిరసలు చేస్తున్నారు. మా డిమాండ్లకు ప్రభుత్వం తలవంచాల్సిందే. న్యాయం కోసం మరింత శక్తితో గళమెత్తుతాం."

-- ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్​.

ప్రియాంక గాంధీకి సంబంధించి.. ఓ వీడియోను పార్టీ విడుదల చేసింది. అతిథి గృహంలో చీపురు పట్టుకుని తన గదిని శుభ్రం చేస్తూ కనపడ్డారు ప్రియాంక.

ప్రియాంక 'గాంధీగిరి'.. హౌస్ అరెస్ట్​ వేళ చీపురు పట్టి...

నిరసనల​కు పిలుపు...

ప్రియాంక గాంధీ బృందాన్ని అరెస్టు చేయడంపై కాంగ్రెస్​ మండిపడింది. రాజకీయ నేతలు ఎక్కడికైనా ప్రయాణించవచ్చని.. వారి స్వేచ్ఛను హరింపజేయడం అత్యంత ప్రమాదకరమని సీనియర్​ నేత రాజివ్​ శుక్లా మండిపడ్డారు. ఈ ఘటనకు నిరసనగా.. మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని ప్రకటించారు.

"భాజపా.. ఓ రైతు వ్యతిరేక పార్టీ. ప్రియాంక, దీపేంద్ర హుడాను సితాపుర్​లో పోలీసులు అడ్డుకున్నారు. హుడాపై దాడి చేశారు. అక్రమంగా నిర్బంధించారు. నేతల స్వేచ్ఛను ఈ విధంగా హరించడం అత్యంత దారుణమైన విషయం. హుడాపై దాడి చేసి యూపీ యంత్రాంగం తప్పుచేసింది."

--- రాజివ్​ శుక్లా, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

"బాధితులు దుఃఖంలో ఉన్నారు. గడ్డుపరిస్థితుల్లో వారికి తోడుగా ఉండాలని మేము అనుకున్నాము. కానీ లఖ్​నవూ నుంచి బయలుదేరిన వెంటనే.. పోలీసులు మమ్మల్ని వెంబడించడం మొదలుపెట్టారు. మేమేదో తప్పుచేసినట్టు మా మీద పడ్డారు."

-- దీపేంద్ర హుడా, కాంగ్రెస్​ నేత.

ఇదీ జరిగింది...

యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో లఖింపుర్​ ఖేరీలో(Lakhimpur Kheri violence) హింస చెలరేగింది. టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- 'లఖింపుర్​ హింసపై రిటైర్డ్​ జడ్జితో విచారణ- వారికి రూ.45లక్షలు పరిహారం'

Last Updated :Oct 4, 2021, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.