ETV Bharat / bharat

కూలీకి రూ.43 లక్షల పన్నుఎగవేత నోటీసులు

author img

By

Published : Feb 20, 2021, 5:03 PM IST

laborer-received-notice-to-pay-43-lakh-tax-in-pali
కూలీ చేసే వ్యక్తికి రూ.43 లక్షల పన్నుఎగవేత నోటీసులు

ఓ మారుమూల తండాలో కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వ్యక్తికి వస్తు,సేవల పన్ను(జీఎస్​టీ) అధికారులు నోటీసులు పంపించారు. ఆయన్ను రూ.24 కోట్లు విలువ చేసే డైమండ్​ కంపెనీకి యజమానిగా పేర్కొన్న వారు.. సుమారు రూ.43 లక్షలు తక్షణమే చెల్లించాలని కోరారు. కూలీకి పోతేగానీ పూటగడవని పరిస్థితుల్లో తన కుటుంబం ఉందన్న బాధితుడు.. అంత మొత్తం ఎలా కట్టాలని వాపోయాడు.

రాజస్థాన్​ డూంగర్​పుర్​​లోని పాలీ అనే గ్రామానికి చెందిన నానారామ్​ అనే వ్యక్తికి జీఎస్​టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కూలీ పనులు చేసుకొని కాలం వెళ్లదీస్తున్న అతన్ని.. రూ.43 లక్షలు పన్ను ఎగవేతదారునిగా పేర్కొన్నారు. సుమారు రూ.24 కోట్ల విలువ చేసే డైమండ్​ కంపెనీకి ఆ కూలీని యజమానిగా పేర్కొన్న వారు.. విధించిన మొత్తాన్ని తప్పనిసరిగా కట్టాలని తెలిపారు. 'సరిగా నిలువునీడ కూడా లేని నాకు జీఎస్​టీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఏమిటని' వాపోయాడా వ్యక్తి. సాయంత్రం వరకు కష్టపడితే రూ.700 మించి సంపాదించలేని నేను.. అంత మొత్తం ఎలా కట్టాలని అన్నాడు.

అసలు విషయం ఇదే..

అధికారుల లెక్కల ప్రకారం.. నానారామ్​ పేరు మీద రూ. 23.80 కోట్లు విలువ చేసే వజ్రాల వ్యాపారం ఉంది. కానీ ఈ విషయం అతనికి తెలియదు. గ్రామాల్లో జరిగే ఉపాధి హామీ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి తన విలువైన పత్రాలను అధికారులకు సమర్పించాడు. అవి చోరీకి గురయ్యాయి. వాటితో గుర్తు తెలియని వ్యక్తులు ఖాతా తెరిచి వ్యవహారం నడిపిస్తున్నారు. బోగస్​ బిల్లులతో పన్ను ఎగవేతకు ప్రయత్నించారు. అయితే పత్రాల్లో ఉండే చిరునామా ప్రకారం అధికారులు నోటీసులు పంపించడంతో అసలు విషయం బయట పడింది.

ఇదీ చూడండి: ఆ కార్డులతో యాచకులు, దివ్యాంగులకు ఉచిత భోజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.