ETV Bharat / bharat

దిల్లీ సరిహద్దులో రైతులకు 'ఫుట్​ మసాజర్లు'

author img

By

Published : Dec 12, 2020, 10:23 AM IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తోన్న రైతులకు మద్దతుగా నిలిచింది 'ఖాల్సా ఎయిడ్​-ఇండియా' స్వస్ఛంద సంస్థ. సింఘు సరిహద్దులో రైతుల కోసం ఫుట్​ మసాజర్స్​ను ఏర్పాటు చేసింది.

Foot massagers
ఫూట్​ మసాజర్స్

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో పోరాటం చేస్తోన్న రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పలువురు.. ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సింఘు సరిహద్దులో.. నిరసనలు చేపట్టి అలసిపోయిన రైతులు సేదతీరేందుకు 'ఫుట్​ మసాజర్స్​' ఏర్పాటు చేసింది 'ఖాల్సా ఎయిడ్​-ఇండియా' అనే ఎన్​జీఓ. 25 మసాజర్స్​ను అందించింది. ముందుగా వయస్సుపైబడిన వారికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది.

Foot massagers
ఫూట్​ మసాజర్స్

" సుదీర్ఘకాలంగా ఇక్కడే ఉన్న వయస్సు పైబడిన రైతులకు ఈ ఫుట్​ మసాజర్స్​లో సేదతీరేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరసనల్లో ఎక్కువ సమయం ఉండటం వల్ల వారు అలసిపోతున్నారు. "

- అమర్​ప్రీత్​, ఖాల్సా ఎయిడ్​ ఇండియా ఎండీ

రైతుల ఆందోళనలకు మద్దతుగా నిలుస్తోన్న వారికి కృతజ్ఞతలు తెలిపింది ఆ ఎన్​జీఓ. తమ బృందం అన్నదాతలకు సాయంగా నిలుస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: పట్టువీడని రైతన్న.. 17వ రోజుకు ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.