కేరళలోని కవలలు.. ఇటీవలే బ్రిటన్ రాణి ఎలిజబెత్కు లేఖ రాశారు. కేరళ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. తాజాగా.. లండన్ విన్డ్సర్ కాస్టిల్ నుంచి వీరికి లేఖ వచ్చింది. రాణి నుంచి స్వయంగా లేఖ అందడం వల్ల వీరు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
![Kerala twin sisters get a letter from British Queen Elizabeth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11620832_twins-2.jpg)
ఇదీ జరిగింది...
త్రిస్సూర్ జిల్లాలోని కూర్కంచెరిలో నివాసముంటున్నారు అన్లిన్-అన్లిత్ అనే కవలలు. ఇరింగలక్కుడ క్రైస్ట్ విద్యానికేతన్ పాఠశాలలో 6వ తరగతి చదువుకుంటున్నారు. మార్చి 8వ తేదీన.. ఎలిజబెత్కు ఉద్దేశించి బకింగ్హమ్ ప్యాలెస్కు వీరు ఓ లేఖ రాశారు. రాణిని కేరళ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. తాము లండన్ సందర్శించాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. త్రిస్సూర్, అలప్పుజ అందాలతో కూడిన పెయింటింగ్స్ను లేఖతో పాటు పంపించారు ఈ కవలలు.
ఈ లేఖకు రాణి ఎలిజబెత్ నుంచి సమాధానం వచ్చింది. దీంతో కవలలు ఆశ్చర్యానికి గురయ్యారు. 'లేఖను చాలా బాగా రాసినందుకు ధన్యవాదాలు' అంటు రాణి బదులిచ్చారు. అందమైన పెయింటింగ్స్ను పంపింనందుకు మెచ్చుకున్నారు. కవలలు ఆనందగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు.
అన్లిన్-అన్లిత్ కవలలు తమ పెయింటింగ్స్తో ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కించుకున్నారు. రాణి ఎలిజబెత్ నుంచి లేఖ రావడం వల్ల వారి తల్లిదండ్రులు సంతోష్- మెఫ్లి సంబరపడిపోతున్నారు.
ఇదీ చూడండి:- బ్రిటన్ నుంచి భారత్కు మరో 1000 వెంటిలేటర్లు