ETV Bharat / bharat

కేరళలో మళ్లీ 30వేలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Sep 8, 2021, 8:30 PM IST

COVID cases in India
దేశంలో కొవిడ్​ కేసులు

కేరళలో కరోనా (Corona cases) విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 30,196 మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి మరో 181 మంది (Corona Deaths) మృతిచెందారు. తమిళనాడులో 1,594 మందికి కరోనా సోకింది.

కేరళలో కరోనా తీవ్రత అంతకంతకు ఎక్కువవుతోంది. గత ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. తాజాగా 30,196 మంది మహమ్మారి​ బారిన (Corona cases) పడ్డారు. 181 మంది బలయ్యారు. దీనితో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 42,83,494కి చేరింది. మృతుల సంఖ్య(Corona Deaths) 22 వేల మార్క్ దాటినట్లు కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

కేరళలో తాజాగా 27,579 మంది కొవిడ్​ను జయించారు. ఇప్పటి వరకు మొత్తం 40,21,456 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,39,480 యాక్టివ్​ కొవిడ్ కేసులు ఉన్నాయి.

తమిళనాడులో తాజాగా 1,587 మందికి కరోనా సోకింది. 18 మంది కరోనాకు బలయ్యారు. 1,594 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 26,27,365 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఇందులో 35,073 మృతి చెందారు.

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం నాటికి 71 కోట్లు డోసులు (71,52,54,153) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • కర్ణాటకలో బుధవారం సాయంత్రం వరకు 1,102 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. 17 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 1,458 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.
  • దిల్లీలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య సున్నాగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 13 మంది కొవిడ్​ను జయించినట్లు తెలిపింది.
  • గోవాలో కొత్తగా 86 మందికి కరోనా సోకింది. మరో ఇద్దరు కొవిడ్​తో మృతి చెందారు. 82 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 856 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి.

ఇదీ చదవండి: 'ఇంటింటికీ కరోనా టీకా​ పంపిణీ అసాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.