ETV Bharat / bharat

కేజ్రీ ఇంటిపై ఈడీ రైడ్? దిల్లీ పోలీసుల భారీ భద్రత- రోడ్లన్నీ బ్లాక్!

author img

By PTI

Published : Jan 4, 2024, 10:29 AM IST

Updated : Jan 4, 2024, 12:43 PM IST

Kejriwal ED Raid News
Kejriwal ED Raid News

Kejriwal ED Raid News : దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో ఈడీ సోదాలు చేయడం సహా ఆయన్ను అరెస్ట్‌ చేయనుందన్న ఆప్‌ నేతల ఆరోపణల మధ్య దిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, మీడియా ప్రతినిధులను నియంత్రించేందుకు భద్రత పెంచినట్లు పోలీసులు వివరణ ఇచ్చారు. మరోవైపు, తనను అరెస్ట్ చేయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.

Kejriwal ED Raid News : దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అధికార నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) దాడి చేయనుందన్న ఆప్‌ మంత్రుల ప్రకటనల మధ్య భద్రతను కట్టుదిట్టం చేయడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కేజ్రీవాల్‌ నివాసానికి దారితీసే రోడ్లన్నింటినీ బ్లాక్‌ చేయడం సహా అన్ని ద్వారాల వద్ద అదనపు బలగాలను మోహరించారని ఆప్‌ వర్గాలు తెలిపాయి. కనీసం ఆయన నివాసంలో పనిచేసే సిబ్బందిని కూడా లోపలికి అనుమతించటం లేదని, కేజ్రీవాల్‌ నివాసంలో దాడులు చేయటం సహా ఆయన్ను అరెస్ట్‌ చేసే ప్రయత్నాలను ఈడీ ముమ్మరం చేసినట్లు ఆప్‌ వర్గాలు ఆరోపించాయి.

'ఈడీ సమన్లు చట్టవిరుద్ధం- అరెస్ట్​కు బీజేపీ కుట్ర!'
లోక్​సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకు తనను బీజేపీ అరెస్ట్ చేయించాలని చూస్తోందని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. దిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఆ విషయం ఈడీకి కూడా తెలుసని వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా సమన్లు పంపిస్తే ఈడీకి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధమేనని అన్నారు.

ఆప్ నేత ట్వీట్- దిల్లీ పోలీసుల వివరణ
గురువారం దిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఈడీ దాడులు చేస్తారని కేబినెట్‌ మంత్రి, ఆప్‌ నాయకురాలు అతిషి ఆరోపించారు. ఆయన్ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.
అయితే ఆప్‌ ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ఆప్‌ మంత్రులు ప్రకటన నేపథ్యంలో మీడియా ప్రతినిధుల రాక పెరిగిందని, వారిని నియంత్రించేందుకే భద్రతను పెంచినట్లు దిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.

Kejriwal ED Raid News
దిల్లీ సీఎం నివాసం వద్ద పోలీసులు

గుజరాత్ పర్యటనకు కేజ్రీ
ఈ పరిణామాల మధ్య కేజ్రీవాల్ గుజరాత్​లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్​సభ ఎన్నికలకు సన్నద్ధత కోసం శనివారం ఆయన గుజరాత్​కు వెళ్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. మూడు రోజుల పాటు గుజరాత్​లో ఆయన పర్యటిస్తారని తెలిపాయి. బహిరంగ సభల్లో పాల్గొనడం సహా పార్టీ వర్గాలతో సమావేశమవుతారని వివరించాయి. జైలుకు వెళ్లిన ఆప్ నేత చైతర్ వాసవను సైతం కలుస్తారని తెలిపాయి.

మళ్లీ నోటీసులు?
మరోవైపు, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విచారణకు రాకపోవటానికి కారణాలు పేర్కొంటూ రాసిన ఐదు పేజీల లేఖను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. మద్యం కుంభకోణం విచారణలో పాల్గొనాలని కోరుతూ నాల్గోసారి సమన్లు పంపే ఆలోచనట్లు ఉన్నట్లు తెలుస్తోంది. తనకు సమన్లు పంపటం అక్రమమన్న కేజ్రీవాల్‌ ఆరోపణలను తోసిపుచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మనీ లాండరింగ్‌ చట్టం ప్రకారం దర్యాప్తు సంస్థ నాల్గోసారి సమన్లు పంపే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్‌కు గతంలో నవంబర్‌ 2న, డిసెంబర్‌ 21న, జనవరి 3న ఈడీ సమన్లు పంపింది.

'అవినీతి పాల్పడి ఇప్పుడు ఆందోళనా?'
ఆప్ నేతలు అవినీతికి పాల్పడి ఇప్పుడు ఆందోళనకు చేస్తున్నారని దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్​దేవ ఆరోపించారు. కేజ్రీవాల్ ఈడీ విచారణ నుంచి పారిపోతున్నారని ధ్వజమెత్తారు. వివరణ ఇచ్చుకునే అవకాశం ఇచ్చినప్పటికీ దర్యాప్తులో భాగమయ్యేందుకు సీఎం ముందుకు రావడం లేదని అన్నారు.

'అరెస్టైనా సరే, మీరే సీఎంగా కొనసాగాలి- జైలు నుంచి పనిచేసేలా కోర్టును కోరుతాం'

ప్రధాని, అదానీపై నిరాధార ఆరోపణలు! కేజ్రీవాల్​, ప్రియాంకకు ఈసీ నోటీసులు

Last Updated :Jan 4, 2024, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.