ETV Bharat / bharat

రూ.5000కు బిడ్డను అమ్మేసిన తల్లి- తిరిగివ్వాలని నర్సుపై కేసు

author img

By

Published : Sep 17, 2021, 2:19 PM IST

కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తన బిడ్డను రూ.5000కు అమ్మేసింది. అయితే ఇప్పుడు తన బిడ్డను తిరిగివ్వాలంటూ.. డిమాండ్​ చేస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ నర్సుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Mother sold newborn for Rs.5000
రూ. 5000కు బిడ్డను అమ్మేసిన తల్లి

ఓ మహిళ.. తనకు పుట్టిన బిడ్డను రూ.5000కు అమ్మేసింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వచ్చి తన బిడ్డను తిరిగి ఇవ్వాలని డిమాండ్​ చేస్తోంది. కర్ణాటక విజయపురలోని జిల్లా ఆస్పత్రిలో జరిగింది ఈ వ్యవహారం.

ఇదీ జరిగింది

విజయపుర జిల్లా తికోట గ్రామానికి చెందిన రేణుక.. జిల్లా ఆస్పత్రిలో ఆగస్టు 19న ఓ బిడ్డకు (రెండో కాన్పు) జన్మనిచ్చింది. అయితే రెండో బిడ్డను చూసుకునే స్తోమత లేకపోవడం వల్ల తన బిడ్డను అమ్మేయాలని నిర్ణయించుకుంది రేణుక. ఇందుకు ఆస్పత్రిలోని కస్తూరి అనే నర్సుతో స్నేహం చేసింది. ఆ నర్సు ద్వారానే తన బిడ్డను ఆగస్టు 26న రూ.5000కు అమ్మేసింది. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆస్పత్రికి వచ్చిన రేణుక.. తన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్​ చేసింది. దీనికి తిరస్కరించిన కస్తూరి.. బిడ్డను తిరిగి ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.

దీంతో మహిళ పోలీస్​ స్టేషన్​లో కస్తూరిపై ఫిర్యాదు చేసింది రేణుక. ఫలితంగా నర్సును సస్పెండ్​ చేశారు. అధికారులు. అలాగే కస్తూరిపై మొత్తంగా మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కల్తీ రక్తంతో అక్రమ దందా- డాక్టర్ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.