ETV Bharat / bharat

లారీ- ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

author img

By

Published : Nov 20, 2021, 12:19 AM IST

టిప్పర్​ లారీ- ఆటో ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన కర్ణాటక మండ్యలో జరిగింది.

Five members of family killed in accident
ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

కర్ణాటక మండ్యలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్​ లారీ.. ఆటోను ఢీకొన్న ఘటనలో బస్సును ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

ఏమైందంటే..?

మండ్యా జిల్లా మలవల్లీ మండలానికి చెందిన ఓ కుటుంబం.. మద్దూర్​లోని ఓ ఆలయాన్ని దర్శించుకుని తిరిగివస్తుంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన లారీ.. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో బందూరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ముత్తమ్మ, ఆమె కుమారుడు, కూతురు, ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.

ఈ ఘటన నీలమక్కనహల్లీ గ్రామం వద్ద జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టామన్నారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: వాహనదారుడి తలపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.