ETV Bharat / bharat

'లఖింపుర్​ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి'

author img

By

Published : Oct 6, 2021, 3:36 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్​ ఖేరి ఘటనను(Lakhimpur Kheri incident) సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​. సామాజిక మాధ్యమాలు లేని రోజుల్లో సుప్రీంకోర్టు పలు అంశాలపై సుమోటోగా వ్యవహరించిందన్నారు.

Kapil Sibal
కపిల్ సిబల్​

లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనను(Lakhimpur Kheri incident) సుమోటోగా తీసుకుని విచారించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్ సిబల్​(Kapil Sibal latest news).

Kapil Sibal twitter
కపిల్​ సిబల్​ ట్వీట్​

"సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్​ లేని రోజుల్లో మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఎన్నో కేసులను సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు (supreme court news) విచారణ జరిపింది. ప్రజల తరఫున గళం వినిపించింది.ఈ రోజుల్లో దేశ పౌరులను తొక్కించి చంపేస్తున్న ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు స్పందించాలి" అని లఖింపుర్​ ఖేరి ఘటనను ఉద్దేశించి సిబల్​ ట్వీట్​ చేశారు.

లఖింపుర్​ ఖేరి(Lakhimpur Kheri news) ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని సిబల్ సోమవారం కోరారు. ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్​​​ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఘటన నేపథ్యం

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో(Lakhimpur Kheri news) ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు అరెస్ట్​ చేయలేదు.

ఇదీ చూడండి: 'లఖింపుర్​ ఘటనతో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్​ యత్నం​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.