ETV Bharat / bharat

అండర్​వేర్​తోనే ఎమ్మెల్యే ట్రైన్ జర్నీ​- అదే కారణమట!

author img

By

Published : Sep 3, 2021, 11:06 AM IST

లోదుస్తులు మాత్రమే ధరించి బిహార్​ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే(Mla in undergarments).. రైలు ప్రయాణం చేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. రైల్లోని తోటి ప్రయాణికులు.. ఎమ్మెల్యే ప్రవర్తనపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.

mla train journey in undergarments
ఎమ్మెల్యే గోపాల్​ మండల్​

బిహార్​ అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వాకం తీవ్ర విమర్శలకు దారి తీసింది. గురువారం పట్నా నుంచి దిల్లీకి జేడీయూ ఎమ్మెల్యే గోపాల్​ మండల్... తేజస్ రాజధాని ఎక్స్​ప్రెస్​లో(Tejas rajadhani express) ప్రయాణించారు. అయితే.. ఆ సమయంలో ఆయన లోదుస్తులు(Mla in undergarments) మాత్రమే ధరించి రైలులో కూర్చొని ప్రయాణం చేశారు.

ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రైల్వే శాఖ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. అయితే.. రైల్వే పోలీసులు, టీటీఈ​ అధికారులు... ఇరు వర్గాలతో చర్చించి సమస్య పరిష్కరించారని తూర్పు మధ్య రైల్వే తెలిపింది.

'అందుకే అలా ప్రయాణించాను'

ఎమ్మెల్యే గోపాల్ మండల్​.. తనపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. కడుపులో ఇబ్బందిగా ఉండటం వల్లే తాను లోదుస్తులు మాత్రమే ధరించి, ప్రయాణించానని చెప్పారు.

అంతకుముందు.. బిహార్​ ఉపముఖ్యమంత్రి తార్​కిషోర్​ ప్రసాద్​కు 'ఐ లవ్యూ' చెప్పి.. ఎమ్మెల్యే గోపాల్​ మండల్ వార్తల్లో నిలిచారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న పురందేశ్వరి వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.