ETV Bharat / bharat

కాంగ్రెస్​ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య.. తలపై తుపాకీతో..

author img

By

Published : Nov 11, 2021, 9:22 PM IST

Jabalpur Crime News
కాంగ్రెస్​ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య.. తలపై తుపాకీతో..

కాంగ్రెస్​ ఎమ్మెల్యే కుమారుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అతని గదిలో నుంచి సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

మధ్యప్రదేశ్​ బర్గి నియోజకవర్గం కాంగ్రెస్​ ఎమ్మెల్యే సంజయ్​ యాదవ్​ కుమారుడు విభోర్​ యాదవ్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్​ నోటు రాసి.. నివాసంలోని తన గదిలో తుపాకీతో తలపై కాల్చుకున్నాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. 16ఏళ్ల విభోర్​ చికిత్స పొందుతూ మరణించాడు.

విషయం తెలుసుకున్న కాంగ్రెస్​ నేతలు ఆసుపత్రికి చేరారు. కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆసుపత్రి చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

అయితే విభోర్​ యదవ్​ తనని తాను ఎందుకు కాల్చుకున్నాడనే విషయంపై స్పష్టత లేదు. సూసైడ్​ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'నా తల్లిదండ్రులు చాలా మంచివారు,' అని అందులో అతడు రాసినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:- బాలికపై అత్యాచారం.. కాపాడాల్సింది పోయి వాళ్లు కూడా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.