ETV Bharat / bharat

వాద్రాను రెండో రోజూ ప్రశ్నించిన ఐటీ

author img

By

Published : Jan 5, 2021, 8:20 PM IST

robert vadra, income tax
రాబర్ట్ వాద్రాను విచారిస్తున్న ఐటీ శాఖ

బినామీ ఆస్తుల కేసుపై రాబర్ట్​​ వాద్రాను ఆదాయపన్ను శాఖ రెండో రోజూ విచారించింది. రాజస్థాన్​లోని బికనేర్​ ప్రాంతంలోని భూమి కొనుగోళ్లపై వాద్రాను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బినామీ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రాను రెండో రోజూ ఆదాయ పన్ను శాఖ విచారించింది. దిల్లీలోని వాద్రా కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్న దర్యాప్తు బృందాలు ప్రశ్నల వర్షం కురిపించాయి.

సుదీర్ఘ విచారణ

వాద్రాను అధికారులు సోమవారం ఎనిమిది గంటల పాటు విచారించారు. రాజస్థాన్​లోని బికనేర్​ ప్రాంతంలోని భూమి కొనుగోళ్లకు సంబంధించి వాద్రాను ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఈడీ (ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరీ) 2015లో మనీలాండరింగ్ కేసు నమోదు చేయడం సహా విచారణ కూడా జరిపింది. స్కై లైట్​ హాస్పిటాలిటీ సంస్థకు చెందిన రూ.4.62 కోట్లు విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసు వివరాలను ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖకు ఈడీ అందించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

"ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం పలువురు చేపడుతున్న చర్యలు. నా భార్య ప్రియాంక ఏదైనా సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించగానే దర్యాప్తు సంస్థలు నా వద్దకే వస్తాయి. ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి అందరి దృష్టి మళ్లించడానికే ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది."

-రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ భర్త

అయితే ప్రస్తుతం జరుతున్న విచారణకు బినామీ వ్యతిరేక చట్టంతో సంబంధం లేదని వాద్రా పేర్కొనడం గమనార్హం.

ఇదీ చదవండి : అక్రమాస్తుల కేసులో వాద్రా వాంగ్మూలం నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.