ETV Bharat / bharat

గుంతలు తవ్వి.. 150 వీధి శునకాలను సజీవంగా పూడ్చి!

author img

By

Published : Sep 8, 2021, 9:26 PM IST

Updated : Sep 8, 2021, 11:40 PM IST

మూగ జీవాలని కూడా చూడకుండా 150కి పైగా వీధి శునకాలను సజీవంగా పూడ్చిపెట్టిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. శివమొగ్గ జిల్లా హోసూర్​ పంచాయత్, హన్​సెకట్టే జంక్షన్​, రంగనాథపూర్​ గ్రామాల్లో కుక్కలను పట్టుకున్న ఓ బృందం వాటిని బతికుండగానే.. పాతిపెట్టింది.

Dogs Burried live
బదికుండగానే కుక్కలను పూచ్చిన వైనం

కుప్పులుగా పడి ఉన్న కుక్కల శవాలు

కర్ణాటక శివమొగ్గ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు 150కి పైగా వీధి శునకాలను సజీవంగా పూడ్చిపెట్టారు. భద్రావతి తాలుకా​ పరిధిలో జరిగింది ఈ ఘటన.

ఇంతకీ ఏం జరిగింది..?

Dogs dead bodies
కుప్పులుగా పడి ఉన్న కుక్కల శవాలు

హూసూర్​ పంచాయత్, హన్​సెకట్టే జంక్షన్​, రంగనాథపూర్​ గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్న కారణంగా.. శునకాలను పట్టే బృందానికి సమాచారమిచ్చారు. ఆ బృందం ఆయా గ్రామాల్లోని 150కిపైగా కుక్కలను పట్టుకుని.. తమ్మడి హల్లి అటవీ ప్రాంతంలో బతికుండగానే పూడ్చి పెట్టారు. శునకాలను పూడ్చే సమయంలో వాటి అరుపులు విని.. స్థానికులు అక్కడకు చేరుకోగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే కుక్కలను పూడ్చిన బృందం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

నిబంధనలకు విరుద్ధంగా..

ఎక్కడైనా కుక్కలను పట్టుకుంటే.. వాటికి టీకాలు వేసి మళ్లీ విడుదల చేయాల్సి ఉంటుంది. కుక్కల బెడత ఎక్కువైతే వాటిని ఒక ప్రాంతంలో పట్టుకుని మరో ప్రాంతంలో విడిచి పెట్టాలి. కానీ మైసూరుకు చెందిన బృందం నిబంధనలను తుంగలో తొక్కి 150కిపైగా శునకాలను బతికుండగానే.. పాతి పెట్టారు.

శివమొగ్గ జిల్లా ప్రాణి దయా సంఘ్​ సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: హైవేపై వందలాది కండోమ్​లు- కావాలనే పడేశారా?

Last Updated : Sep 8, 2021, 11:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.