ETV Bharat / bharat

'దేశ విచ్ఛిన్నం కోరే సంస్థల పేరులోనూ ఇండియా ఉంది'.. విపక్ష కూటమిపై మోదీ ఫైర్

author img

By

Published : Jul 25, 2023, 12:19 PM IST

Updated : Jul 25, 2023, 2:22 PM IST

BJP Parliamentary Party Meeting : ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టుకోవడంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈస్ట్​ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ పేరులో కూడా ఇండియా ఉందంటూ ధ్వజమెత్తారు.

BJP Parliamentary Party Meeting
BJP Parliamentary Party Meeting

BJP Parliamentary Party Meeting : విపక్షాలు నూతనంగా ఏర్పాటు చేసుకున్న 'ఇండియా' కూటమిపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇండియన్ ముజాహిదీన్, ఈస్ట్​ ఇండియన్​ కంపెనీ పేరులో కూడా ఇండియా ఉందంటూ విరుచుకుపడ్డారు. కూటమి పేరులో ఇండియా ఉండటం వల్ల ఏమీ మారదని అన్నారు. దేశ విచ్ఛిన్నం కోరే పీఎఫ్ఐ వంటి సంస్థల పేరులోనూ ఇండియా ఉందని గుర్తు చేశారు. సరైన దశాదిశాలేని విపక్షాన్ని ఇప్పటివరకు చూడలేదంటూ ఘాటైన విమర్శలు చేశారు. 26 పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డ నేపథ్యంలో.. వారి లక్ష్యంగా పార్లమెంటరీ సమావేశంలో మోదీ విరుచుకుపడ్డారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.

  • #WATCH | BJP MP Ravi Shankar Prasad, says "We are proud of our PM. We are coming back to power in 2024. PM Modi has given a statement that Indian National Congress, East India Company was founded by a foreign national. Today people are using names like Indian Mujahideen and… pic.twitter.com/XRpkEXl0eF

    — ANI (@ANI) July 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేవలం దేశం పేరును ఉపయోగించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని.. ప్రతిపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ ప్రసంగించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ప్రతిపక్షాలు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నాయని, ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఆ పార్టీలు నిర్ణయించుకున్నట్లు.. వాటి ప్రవర్తన ద్వారా తెలుస్తోందని ఆయన అన్నారు. కానీ తాము మాత్రం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని అనుకుంటున్నట్లు మోదీ తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తమ ప్రభుత్వ హయాంలో భారత్​ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

"ఈరోజు ప్రపంచం ముందు భారత్​ ప్రతిష్ఠ గణనీయంగా పెరిగింది. ఆ దిశలో పని చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. అమృత్ కాల్ (2047) నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రతిపక్షాలు 'ఇండియా' పేరు చుట్టూ తిరగడం.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే. ఈస్ట్​ ఇండియా కంపెనీ లాగానే ఇండియన్ నేషనల్​ కాంగ్రెస్​ను కూడా కూడా విదేశీయులే స్థాపించారు. దేశ విచ్ఛిన్నం కోరే ఇండియన్‌ ముజాహిదీన్‌, పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)లో కూడా ఇండియా అనే పదం ఉంది."
--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

మిస్టర్​ మోదీ.. మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి : రాహుల్​
ప్రతిపక్షాల ఇండియా కూటమిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ స్పందించారు. 'మిస్టర్​ మోదీ.. మీకు ఎలా పిలవాలనిపిస్తే మమ్మల్ని అలా పిలవండి. మేము 'ఇండియా'. మేము మణిపుర్‌ గాయాన్ని నయం చేయడానికి.. ప్రతి మహిళ, పిల్లల కన్నీళ్లు తుడవడానికి సహాయం చేస్తాము. మణిపుర్​ ప్రజలందరికీ ప్రేమ, శాంతిని తిరిగి తీసుకువస్తాము. భారతదేశ ఆలోచనను మణిపుర్‌లో పునర్నిర్మిస్తాం' అని ట్వీట్​ చేశారు.

  • Call us whatever you want, Mr. Modi.

    We are INDIA.

    We will help heal Manipur and wipe the tears of every woman and child. We will bring back love and peace for all her people.

    We will rebuild the idea of India in Manipur.

    — Rahul Gandhi (@RahulGandhi) July 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated : Jul 25, 2023, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.